Top Stories

పోసాని అరెస్ట్ కు ముందు అసలు ఏం జరిగిందంటే?

ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలోని మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్‌లో అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడకు తరలించి, గురువారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను విచారణ ఖైదీగా జైలుకు పంపే అవకాశం ఉంది.

అరెస్టుకు ముందు పోసాని కృష్ణ మురళికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆరోగ్యం బాగోలేదని, ముందుగా హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుని పోలీసులు కోరిన మేరకు సహకరిస్తానని పోసాని విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసులు, తాము అతడిని అరెస్ట్ చేయడానికి అన్ని అనుమతులు ఉన్నాయని, సరైన ఆధారాలతోనే ఈ చర్య చేపట్టామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, ఆయన ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు తెలిపారు.

పోసాని కుటుంబ సభ్యులు ఈ ఘటనను తమ ఫోన్లలో వీడియో తీసేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని ఆపారు. అనంతరం పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. అపార్ట్‌మెంట్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే, పోసాని అరెస్టుకు ముందు పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగిందని సమాచారం. “మీరు ఎవరో నాకు తెలియదు, నా ఇంటికి ఎందుకు వచ్చారో తెలియదు. మీతో నేను ఎందుకు రావాలి?” అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కృష్ణ మురళి తీరును చూసి పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, పోసాని పోలీసులతో గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. నోటీసులు ఇచ్చినప్పటికీ, తీసుకోవడానికి ఆయన నిరాకరించారని పేర్కొన్నారు. అదనంగా, పోలీసులపై అభ్యంతరకరమైన భాషలో వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు.

పోసాని భార్య కూడా ఈ ఘటనపై స్పందించారు. “పోలీసులు రాత్రి మా ఇంటికి వచ్చి గందరగోళం సృష్టించారు. ఆయనకు అన్నం తినడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఆయన హాస్పిటల్ వెళ్తానని చెప్పినా, వినిపించుకోలేదు. ఆయన 66 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఉన్నా, పోలీసులు అతనిని వదలలేదు,” అని ఆమె వాపోయారు.

ఈ అరెస్టుకు ప్రధాన కారణంగా, పోసాని గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలే కారణమని పోలీసులు చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయంలో ఆయన ఏపీ ఎఫ్డివిడిసి చైర్మన్‌గా పనిచేశారు. అయితే, ఆ తర్వాత నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై ఫిర్యాదులు అందాయని, అందువల్లే అరెస్ట్ చేసినట్లు ఓబులవారిపల్లె పోలీసులు వెల్లడించారు.

గురువారం ఉదయం పోసాని కృష్ణ మురళిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చే అవకాశం ఉంది.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories