Top Stories

ABN రాధాకృష్ణకు ఏమైంది? 

వేమూరి రాధాకృష్ణ, స్వతహాగా పేరున్న పాత్రికేయుడు. తనకున్న సుదీర్ఘ పరిచయాలతో “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” కార్యక్రమాన్ని అనేక సీజన్లలో విజయవంతంగా నిర్వహించారు. రాధాకృష్ణ ప్రశ్నలు అడిగే విధానం, సరదాగా మాట్లాడే శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయ నాయకులు అనేక సంచలన విషయాలను బయటపెట్టారు, అవి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కేఏ పాల్, రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను సొంతం చేసుకున్నాయి. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వేమూరి రాధాకృష్ణ నవ్వే తీరుపై రకరకాల విమర్శలు వచ్చినా, ఆయన తన శైలిని మార్చుకోలేదు.
రాధాకృష్ణ ప్రశ్నలు అడిగే విధానం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఒక కథానాయికను ప్రశ్నలు అడిగిన తీరు చాలా అభ్యంతరకరంగా అనిపించింది, దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. అలాగే, రామ్మోహన్ నాయుడును ఇంటర్వ్యూ చేసినప్పుడు ఉత్తరాంధ్ర సంస్కృతిని అవమానించారని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణకు వ్యతిరేకంగా నిరసనలు, దిష్టిబొమ్మల దహనం వంటివి కూడా జరిగాయి. ఇలాంటి పరిణామాలు ఉన్నప్పటికీ, వేమూరి రాధాకృష్ణ తన కార్యక్రమాన్ని అప్పట్లో నిర్విఘ్నంగా కొనసాగించారు. గత ఏడాది మాత్రం కూటమి తరఫున పోటీ చేస్తున్న నేతలను ఆయన ఇంటర్వ్యూ చేశారు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ నుండి మొదలుకొని కూటమిలోని కీలక నాయకుల వరకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు నిర్వహించారు.
వాస్తవానికి, వేమూరి రాధాకృష్ణ ఇలా చేయడం ఆయన సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులను కూడా ఆశ్చర్యపరిచింది. పెద్ద పెద్ద వ్యక్తులను ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ, కూటమిలోని కొందరు అభ్యర్థులతోనే ముఖాముఖి నిర్వహించడం చర్చకు దారితీసింది. అయితే, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వేమూరి రాధాకృష్ణ “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. మధ్యలో కమెడియన్ సత్య “రంగబలి” సినిమా ప్రమోషన్ కోసం రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేసే విధానాన్ని అచ్చుగుద్దినట్లు పేరడీ వీడియో చేశాడు. ఇప్పుడు రాధాకృష్ణ తన పత్రికలో *”కొత్త పలుకు”*కు మాత్రమే పరిమితమవుతున్నారు. అది కూడా తన సంస్థలో పనిచేసే ఉద్యోగులతోనే రాయిస్తున్నారని సమాచారం. రాధాకృష్ణ ఒక లైన్ చెబితే, సంస్థలోని కొంతమంది ఉద్యోగులు దానిని అల్లుకుంటూ ప్రతి ఆదివారం “కొత్త పలుకు” సంపాదకీయం రాస్తున్నారు. కానీ, “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే”ను మాత్రం “కొత్త పలుకు” స్థాయిలో వేమూరి రాధాకృష్ణ నిర్వహించడం లేదు. బహుశా మరికొద్ది రోజుల్లో మరో సీజన్ ప్రారంభమవుతుందని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. ఇదంతా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories