Top Stories

ఏపీకి మరో వాయుగుండం.. ఇది మరో స్కామ్ గండమే

విపత్తులు వస్తే ఎవరైనా భయపడతారు. వేలాదిమంది నిరాశ్రయులు అవుతారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతుంది. అందుకే విపత్తు పేరు వింటేనే చాలామంది భయాందోళన చెందుతుంటారు. కానీ, ఏపీలో మాత్రం ప్రకృతి విపత్తులు అంటే కూటమి నేతలు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తారు. ఎందుకంటే విపత్తును కూడా ఆదాయ వనరుగా మార్చుకోవడంలో కూటమి నేతలకు మించిన వాళ్లు మరొకరు ఉండరు. కొద్ది రోజుల కిందట వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. ప్రతిపక్ష వైసిపితోపాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. అయితే ఈ విపత్తును కూడా లాభసాటిగా మార్చుకోవడంలో టిడిపికి మించిన సిద్ధహస్తులు లేరనే చెప్పాలి.

వరద బాధిత ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందించిన పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు కోట్లాది రూపాయలు ఖర్చు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం చూపించిన లెక్కలను చూసి వరదబాధిత ప్రాంతాల్లోని ప్రజలు ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చూసిన రాష్ట్ర ప్రజలు విపత్తును కూడా ఆదాయ వనరుగా మార్చుకోవడం అంటే ఇదేనేమో అంటూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసిన విపత్తు సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమాలు, దానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించిన లెక్కల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ నుంచి మరో వచ్చింది. ఈనెల 22న ఆల్పపీడనం ఏర్పడుతుందని అది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాయుగుండం హెచ్చరికతో రాష్ట్రంలోని ప్రజలు ఆందోళన చెందుతుంటే కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. రెండు చేతులతో కోట్లాది రూపాయలు దోచుకునే అవకాశాన్ని వాయుగుండం కల్పిస్తోందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే.. రాష్ట్ర ప్రజలు మాత్రం వాయుగుండం కాస్త మరో స్కాం గండంగా కనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాయుగుండం ఎంత పెద్ద స్కాం గండంగా మారుతుందో తెలియడం లేదంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ వాయుగుండం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటూ సాధారణ ప్రజలు కోరుకుంటుండగా.. కూటమి నేతలు మాత్రం వాయుగుండం పరిధిని పెంచేలా వరుణ దేవుడును కోరుకుంటున్నారు. అప్పుడే కాస్త లెక్క ఎక్కువ చూపించి మరింత బొక్కేందుకు ఎందుకు అవకాశం ఉంటుందని టిడిపి నేతలు భావిస్తుండటమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. ఈ వాయుగుండం మరో స్కాం గండం అవుతుందా.? వరుణ దేవుడు కూటమి నేతలకు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను కాపాడుతాడా చూడాలి మరి.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories