సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని, బాధితుడు శ్రీతేజ్ ను కనీసం పరామర్శించలేదని హీరో అల్లు అర్జున్ పెద్ద అభాంఢాన్ని వేశారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి. పోలీసులు. ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగ్గా అవ్వడంతో 2 కోట్ల సాయం చేసిన అల్లు అర్జున్ ఆ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బెయిల్ రావడంతో పరామర్శకు రెడీ అయ్యారు. అయితే ఆయన రావడానికి వీల్లేదంటూ.. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ దే బాధ్యత అని.. ఆయనకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.
తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ను అల్లు అర్జున్ కలవట్లేదు అంటూ అసెంబ్లీలో విరుచుకుపడ్డ సీఎం రేవంత్ ఇప్పుడు పోతానంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని పలువురు బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే కలవడానికి సాకులు చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు కనీసం జాలి దయ లేదు అంటూ అల్లు అర్జున్ పై మీడియాలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారని నిలదీస్తున్నారు.
ఇదే విషయమై కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ సానుభూతిపరులు ఇప్పుడు సమాధానం చెప్పాలని కౌంటర్ ఇస్తున్నారు.
అల్లు అర్జున్ అనేక సార్లు శ్రీతేజ్ ను కలుస్తాను అనుమతి ఇవ్వండి అన్నా అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఎందుకో కారణం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఈరోజు నిజం బయటపడింది. అల్లు అర్జున్ శ్రీతేజ్ను కలవకుండా ఎప్పటికపుడు కేసు పేరుతో ప్రభుత్వమే బెదిరించడం ఎంత వరకు న్యాయం అని పలువురు నిలదీస్తున్నారు. బన్నీకి పంపిన ఈ నోటీసులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.