Top Stories

జగన్ రె‘ఢీ’ .. ఏపీలో పరిస్థితులు మారుతాయా?

జగన్ దాదాపు ఆరు నెలల తర్వాత ప్రజల మధ్యకి రావాలని చూస్తున్నారు. 2025 సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల పర్యటన చేయాలని తాడేపల్లిలోని పార్టీ కేడర్ సమావేశంలో ఆయన ప్రకటించారు. ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉండాలని భావిస్తున్నారు. ఈ విధంగా, 50 రోజుల పాటు ఏపీలోని 26 జిల్లాలను సందర్శించాలని ఆయన యోచిస్తున్నారు. అంతేకాదు, క్యాడర్‌కు తన మద్దతు ఉందని సంకేతాలు పంపాలని కూడా చూస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీ క్యాడర్ పూర్తిగా నిరుత్సాహంగా ఉంది. వారిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కూటమి అధికారంలో ఉన్నందున, గ్రామాలు మరియు మండలాల్లో వారిదే ఆధిపత్యం ఉంది. అందువల్ల, వైసీపీ క్యాడర్ పూర్తిగా మౌనంగా ఉంది. ఎందుకు ఇంత తంటా అన్నట్లుగా ఉన్నారు.

2019 నుండి వైసీపీ క్యాడర్‌లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. అధికారంలో ఉన్న సమయంలో, వైసీపీ నాయకత్వం వారిని పూర్తిగా పక్కకు నెట్టేసింది. దీంతో వారు పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితి 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు తమ స్వంత వ్యాపారంలో బిజీగా ఉన్నారు. అందువల్ల, వైసీపీ క్యాడర్ నిరుత్సాహానికి గురైంది.

సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెడుతున్న కేసులు, గ్రామాల్లో టార్గెట్ చేసి జరుగుతున్న దాడులు, ఇవన్నీ వైసీపీ నేతల నుంచి ఎలాంటి సహకారం లేకుండా జరుగుతున్నాయి. అందువల్ల, క్యాడర్ పూర్తిగా డీలా పడిందని అంటున్నారు. జగన్ అంటే ప్రజల సందోహం అని చెప్పడం ఉంది. ఆయన ఎన్నికల్లో గెలవవచ్చు లేదా ఓడవచ్చు, కానీ ప్రజలు ఎప్పుడూ ఆయనతో ఉంటారు. అలాగే, గతంలో క్యాడర్ కూడా జగన్‌తో పెద్ద సంఖ్యలో ఉండేది.

అయితే, ఇప్పుడు క్యాడర్ అనుకున్న స్థాయిలో కనిపించకపోతే, అది ఇబ్బంది కలిగించవచ్చా అన్న చర్చ జరుగుతోంది. మరి జగన్ రెఢీ అంటున్నారు, కానీ క్యాడర్ ఎలా ఉంటుందో చూడాలి అని అంటున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories