Top Stories

వైసీపీ ‘బాంబ్’ పేలిందా లేదా?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో టీడీపీ ట్రూత్ బాంబులు, టైమ్ బాంబుల కల్చర్ ను ముందుకు తెచ్చింది. 2023 అక్టోబర్ 23న టీడీపీ సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేసింది – ‘‘రేపు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్‌పోజ్… కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 పీఎం’’. ఈ పోస్టు వైరల్ కావడంతో, వైసీపీ కూడా అదే సమయంలో ‘‘బ్లాస్టింగ్ న్యూస్ రిలీజ్’’ చేస్తామని ప్రకటించింది. దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర పోటీ నెలకొంది.

తాజాగా, అదే ధోరణిలో వల్లభనేని వంశీ ఎపిసోడ్‌పై వైసీపీ ‘‘ట్రూత్ బాంబు’’ పేల్చుతామని నిన్న ప్రకటించింది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కేసులో వైసీపీ ఏం వెల్లడిస్తుందో అన్న ఆసక్తి పెరిగింది. అయితే, అందరికీ ఇప్పటికే తెలిసిన సత్యవర్థన్ వాంగ్మూలాన్ని బయటపెట్టడంతో, వైసీపీ అనుచరులు నిరాశ చెందారని తెలుస్తోంది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటూ, సత్యవర్థన్ గతంలో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. అయితే, బెదిరింపుల కారణంగా ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడని పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వారం రోజులుగా ఈ అంశంపై చర్చ కొనసాగుతున్నా, వైసీపీ కొత్తగా ఏమీ వెల్లడించకుండా పాత విషయాన్నే మరోసారి చెప్పడంతో, వారి అనుచరులు కూడా నిరుత్సాహానికి గురయ్యారని చెబుతున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories