Top Stories

అరెస్టులపై తగ్గేదేలే.. రెడీ అవుతున్న వైసిపి

ఏపీలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ఒకవైపు ప్రతిపక్షాన్ని భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రశ్నిస్తున్న వారిపైన కర్కశంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా వినియోగదారులను కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది. భవిష్యత్తులో మరింత మందిని అరెస్టు చేసేలా ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిపై కర్కశంగా వ్యవహరించాల్సిందిగా ప్రభుత్వం పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. ఇదంతా సోషల్ మీడియాను తమ అదుపులో ఉంచుకునే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాలు వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను, విస్మరించిన హామీలను సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రజల దృష్టికి తీసుకు వెళుతున్నారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుండడంతో ఇటువంటి వారిని నియంత్రించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది.

ఇందులో భాగంగానే వైసీపీ సోషల్ మీడియా గుంటూరు కన్వీనర్ ను అరెస్టు చేయగా, ఇంటూరి రవికిరణ్ కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైసిపి కూడా ప్రభుత్వ చర్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కొట్టడం, ఇతర వేధింపులకు గురి చేయడం వంటివి చేస్తే తమకు ఫోన్ చేయాలంటూ వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, లీగల్ వ్యవహారాల బాధ్యుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలు వారీగా సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు గురి చేసే వ్యవహారాలపై దృష్టి సారించేలా కమిటీలను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు.

తాజాగా న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు అనుగుణంగా సుధాకర్ రెడ్డి కూడా చర్యలు చేపట్టడం వైసిపి శ్రేణులకు భరోసాను కల్పించినట్లు అయింది. పోలీసుల నుంచి వేధింపులు ఎదుర్కొనే సోషల్ మీడియా కార్యకర్తలు తమను సంప్రదించాలని సూచించారు. సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సభ్యుల వివరాలను తెలియజేశారు. జె సుదర్శన్ రెడ్డి (సీనియర్ అడ్వకేట్ – 9440284455), కొమ్మూరి కనకారావు (మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ – 9963425526), దొడ్డ అంజిరెడ్డి (రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ – 9912205535) నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. పార్టీ నుంచి లభించిన తామింకా తగ్గేదేలే అంటూ వైసీపీ కార్యకర్తలు మరింత యాక్టివేట్ అవుతున్నారు. అరెస్టులకు తాము భయపడేది లేదంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం తప్పెలా అవుతుందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories