Top Stories

జగన్ తో రఘురామ.. అసెంబ్లీలో అదిరిపోయే సీన్

ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇవాళ అసెంబ్లీ సమావేశాల వేళ కలుసుకున్నారు. అసలే ఇవాళ గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలిపేందుకు నల్ల కండువాలతో వచ్చిన జగన్ కు లాబీల్లో రఘురామ కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి.

ఇవాళ అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ కు లాబీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కనిపించారు. అంతే వెంటనే రఘురామ ఆయన్ను పలకరించారు. అంతే కాదు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ దృశ్యం చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టక తప్పలేదు.

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నం చేశారంటూ జగన్ తో పాటు అప్పటి అధికారులపై కేసు పెట్టిన రఘురామకృష్ణంరాజు.. తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జగన్ కనిపించగానే రఘురామరాజు ఆయన వద్దకు ఎందుకు వెళ్లారు, ఏం మాట్లాడారన్న దానిపై చర్చ జరుగుతోంది.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో జగన్ తో మాటామంతీ ద్వారా చంద్రబాబుకు ఆయన భవిష్యత్ సంకేతం ఇచ్చారా అన్న చర్చ జరుగుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories