జగన్ రోడ్డెక్కితే ఇట్ట ఉంటది మరీ

అభిమాన నాయకుడు జనంలోకి వస్తే ఎట్టా ఉంటుందో ఈరోజు ఆవిష్కృతమైంది. జగన్ కోసం జనం రోడ్ల వెంబడి తండోపతండోలుగా వచ్చిన వైనం అందరినీ మెస్మరైజ్ చేసింది. ఒక ప్రజా నాయకుడికి ప్రజల్లో ఇంత పలుకుబడి.. ప్రజాదరణ ఉంటుందా? అని ప్రతిపక్ష కూటమి సర్కార్ కూడా షాక్ అయ్యేలా జనం వచ్చారు.

ప్రజలకు మంచి చేస్తే వారు గుండెల్లో దాచుకుంటారని మరోసారి నిరూపితమైంది. జగన్ ఇడుపుల పాయ లో క్రిస్మస్ వేడుకలను ముగించుకొని అటు నుంచి అటే బెంగళూరుకు వ్యక్తిగత పని నిమిత్తం బయలు దేరారు. ఈ సందర్భంగా దారి పొడవునా.. జగన్ కోసం జనం బారులు తీరడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. పూలు పట్టుకొని జనం జగన్ పై చల్లుతూ తన అభిమానం చాటుకున్నారు.

ఈ వీడియోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
ఎవ్వడి మోచేతి నీళ్లు తాగకుండా 40% ఓటు బ్యాంకు సంపాదించుకున్న లీడర్ వెళితే ఇలానే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. పర్సనల్ పనిమీద రోడ్ మీద వెళుతుంటూనే ఇట్టా ఉంటే, అదే ఈ మనిషి జనాల్లోకి డైరెక్ట్‌గా దిగితే… పిక్చర్ మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నామని వైసీపీ అభిమానులు అంటున్నారు.
జగన్ అంటేనే జనం.. జనం అంటేనే జగన్ అని నిరూపితమైందని.. కనకాంబరం పూలు కేజీ 1000₹ పైన ఉన్నాయని.. అప్పటికప్పుడు ఒక గంప పూలు తీసుకొని వచ్చి జగన్ అన్నకి బత్తలపల్లి లో స్వాగతం పలికారంటే జనాల్లో జగన్ పై ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

వీడియో కోసం క్లిక్ చేయండి