వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఎప్పుడూ ఒక ప్రభంజనంలానే ఉంటుంది. తాజాగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ సాక్షిగా మరోసారి జగన్ చరిష్మా ఏంటో నిరూపితమైంది. జగన్ కాన్వాయ్ వెంట అశేష జనవాహిని కదలివచ్చిన తీరు చూస్తుంటే.. “జగన్ వస్తే ఇట్లుంటదీ” అనే రేంజ్లో ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఈ ర్యాలీకి సంబంధించిన డ్రోన్ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. వారధిపై కిలోమీటర్ల మేర వైసీపీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు బారులు తీరి కనిపించారు. పైనుంచి చూస్తే వారధి మొత్తం నీలం రంగు పులుముకున్నట్లుగా అనిపిస్తోంది. ఈ విజువల్స్ చూస్తుంటే ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం.
వైసీపీ జెండాలు, ప్లకార్డులతో కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. జగన్ కాన్వాయ్పై పూల వర్షం కురిపిస్తూ, నినాదాలతో హోరెత్తించారు. జనసందోహం ఏ స్థాయిలో ఉందంటే.. వారధిపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. వృద్ధులు, మహిళలు సైతం జగన్ కోసం ఎండను కూడా లెక్కచేయకుండా వేచి చూడటం విశేషం. “ఇది కేవలం ఒక ర్యాలీ మాత్రమే కాదు.. జగన్ పట్ల ప్రజలకు ఉన్న ఆదరణకు నిదర్శనం” అని పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.
ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జగన్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ తగ్గలేదని ఈ వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ జన సమీకరణను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

