Top Stories

వైఎస్ జగన్ సీరియస్

ఎంపీపీ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేశారని, ఎన్నికలను బల ప్రదర్శనకు వేదికగా మార్చారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో స్పందించారు.

చిన్న ఎంపీపీ ఎన్నికలోనే ఇలాంటి అప్రజాస్వామిక ఘటనలు జరగడం, కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బయటపెడుతోందని జగన్ అన్నారు. దేశానికి ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చారని విమర్శించారు.

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై దాడులు జరిగాయని, ఓ మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడగా, ఒకరిని కిడ్నాప్ చేశారని జగన్ ఆరోపించారు. మరోవైపు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా ఎంపీటీసీలను నిర్బంధించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు.

ఈ ఘటనలన్నింటిలో పోలీసులు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని, ఎన్నికల అధికారులు మౌన ప్రేక్షకుల్లా వ్యవహరించారని జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే విఫలమవుతున్నాయని, అధికార దుర్వినియోగం ఎంత తీవ్రంగా ఉందో ఇవే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories