Top Stories

వైఎస్ జగన్ సీరియస్

ఎంపీపీ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేశారని, ఎన్నికలను బల ప్రదర్శనకు వేదికగా మార్చారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో స్పందించారు.

చిన్న ఎంపీపీ ఎన్నికలోనే ఇలాంటి అప్రజాస్వామిక ఘటనలు జరగడం, కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బయటపెడుతోందని జగన్ అన్నారు. దేశానికి ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చారని విమర్శించారు.

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై దాడులు జరిగాయని, ఓ మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడగా, ఒకరిని కిడ్నాప్ చేశారని జగన్ ఆరోపించారు. మరోవైపు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా ఎంపీటీసీలను నిర్బంధించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు.

ఈ ఘటనలన్నింటిలో పోలీసులు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని, ఎన్నికల అధికారులు మౌన ప్రేక్షకుల్లా వ్యవహరించారని జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే విఫలమవుతున్నాయని, అధికార దుర్వినియోగం ఎంత తీవ్రంగా ఉందో ఇవే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

Trending today

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది....

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో...

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

చంద్రబాబును నిలదీసిన వెంకయ్య.. షాకింగ్ వీడియో

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుతం...

నేనే… నేనే… అన్నీ నేనే! సాయిరెడ్డి ట్వీట్ వైరల్

వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ...

Topics

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది....

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో...

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

చంద్రబాబును నిలదీసిన వెంకయ్య.. షాకింగ్ వీడియో

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుతం...

నేనే… నేనే… అన్నీ నేనే! సాయిరెడ్డి ట్వీట్ వైరల్

వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ...

2029లో దువ్వాడ శపథం నెరవేరుతుందా?!

వైసీపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న నేత దువ్వాడ శ్రీనివాస్ మరోసారి రాజకీయంగా...

కలిసిన మనసులు.. వారిద్దరినీ కలిపిన రాజశేఖర్ రెడ్డి స్నేహితులు?!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోందా?...

భోగాపురాన్ని హైజాక్ చేసిన ఎల్లో మీడియా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ కొత్త విషయం కాదు. కానీ ఈసారి...

Related Articles

Popular Categories