ప్రపంచ వన్డే వరల్డ్కప్ను గెలుచుకున్న భారత మహిళా జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కష్టసాధ్యమైన పోరాటం తరువాత ట్రోఫీని గెలుచుకున్న ఈ గర్ల్స్ నిజంగా గర్వించదగ్గ ఘనత సాధించారు. దేశం అంతా ఈ విజయంలో తడిసి ముద్దవుతుంటే, ఆ ఆనందంలో కూడా ఎవరో ఒకరు రాజకీయ రంగు వేసే ప్రయత్నం చేస్తారేమోనని ఎవరూ ఊహించలేదేమో!
అయితే… ఊహించని చోటునుంచే ట్విస్ట్ ఇచ్చారు ప్రముఖ టీవీ5 యాంకర్ సాంబశివరావు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ పండుగకు కారణమయ్యాయి.
“కప్ గెలవడంలో సచిన్, లోకేష్ పాత్ర ఉంది!” అవును! అదే నిజం. మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు కాదు, సచిన్ టెండూల్కర్ మరియు లోకేష్ నారా భారత జట్టుకు స్ఫూర్తినిచ్చారని సాంబన్న గారు సీరియస్గా చెప్పారు. అంతేకాదు, “మ్యాచ్ ఆడకముందే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఓడిపోయామనేసింది. కారణం సచిన్, లోకేష్ ఇచ్చిన స్పూర్తే!” అని కూడా జోడించారు.
ఇంతకుముందు గూగుల్ ప్రాజెక్ట్, టాటా ఇన్వెస్ట్మెంట్, లేదా సౌరశక్తి కేంద్రం ఏదైనా జరగాలి అంటే “లోకేష్ వల్లే” అని చెప్పే సాంబశివరావు ఇప్పుడు వరల్డ్కప్కూ అదే ఫార్ములా ఫాలో చేశారు.
ఇంటర్నెట్ లో ప్రజలు మాత్రం దీన్ని విడిచిపెట్టలేదు. “టీమిండియా మహిళలు ఆడిన మ్యాచ్లా? లేక లోకేష్ ప్రాక్టీస్ చేశాడా?” “ప్రతీ విజయానికి టీడీపీ బ్రాండ్ ట్యాగ్ పెట్టేస్తే… దేశం అంతా ఎల్లో అవుతుంది!” అన్న రీతిలో మీమ్స్, సెటైర్లు వర్షం కురుస్తోంది.
విజయం భారత మహిళలది. వారు రాసిన చరిత్ర వారికి చెందాలి.
కానీ రాజకీయ మైండ్సెట్తో ప్రతీ విషయాన్నీ “లోకేష్, బాబు” చుట్టూ తిప్పే ఎల్లో మీడియా పద్ధతి ఇప్పుడంతా ప్రజల హాస్యానికి కారణమవుతోంది.
సాంబన్న గారు, ఒక సజెషన్ మరోసారి ఎవరైనా విజయం సాధిస్తే, క్రెడిట్ ఇవ్వడానికి ముందు వాళ్లే గెలిచారని గుర్తుంచుకోండి. ఇలా కొనసాగితే “లోకేష్ వల్లే సూర్యుడు ఉదయమవుతున్నాడు” అనే హెడ్లైన్ కూడా దూరంలో లేదు!


