మీడియా పక్షపాత ధోరణిపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ABN వెంకటకృష్ణ, TV5 సాంబ, మహా న్యూస్ వంశి లను లక్ష్యంగా చేసుకుని, వీళ్లే 2029 ఎన్నికల్లో టీడీపీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారతారని విమర్శించారు.
“ABN అనే పేరు ఎందుకు? నేరుగా CBN (Chandrababu Naidu) అని పెట్టుకోండి!” అంటూ గుడివాడ అమర్నాథ్ వ్యంగ్యంగా అన్నారు. మీడియా సంస్థలు పక్షపాత ధోరణి ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన వ్యాఖ్యానించారు.
“ఈ చానళ్లలో వస్తున్న వార్తలు ప్రజల వాస్తవ సమస్యలకన్నా, చంద్రబాబు ప్రచార యంత్రంగానే కనిపిస్తున్నాయి” అని గుడివాడ ఆరోపించారు. “ఈ ముగ్గురు యాంకర్లు, ఎడిటర్లు ఇక జర్నలిస్టులు కాదు… నేరుగా టీడీపీ మీడియా మేనేజర్లుగా మారిపోయారు. 2029లో బాబుకు ప్రచార వాహకులుగా బహిరంగంగా పనిచేస్తే ఆశ్చర్యం లేదు.”
వైసీపీ నేత ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు ఆయన విమర్శలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్నారు.
గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో మరోసారి మీడియా-పాలిటిక్స్ సంబంధం చర్చనీయాంశమైంది. 2029 ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, రాజకీయ నాయకుల మాటలతో పాటు మీడియా పాత్ర కూడా మరింత హాట్ టాపిక్గా మారుతోంది.
https://x.com/YSJ2024/status/1986713677660327956


