Top Stories

టీడీపీని కడిగేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

 

రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారికి ఇవ్వాల్సిన పరిహారం సైతం సరిగా అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఏబీఎన్ లైవ్ కార్యక్రమంలో వెంకటకృష్ణ మాట్లాడుతూ, అమరావతి విషయంలో మంత్రి నారాయణ తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “అమరావతిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు,” అని స్పష్టం చేస్తూ, “భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వడం లేదు,” అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

“ఉద్దేశపూర్వకంగా భూములిచ్చిన రైతులకు… ఇవ్వని రైతుల పొలాల్లో పట్టాలు ఎలా ఇస్తారంటూ” వెంకటకృష్ణ ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరగడం లేదని, వారి సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.

రైతుల సమస్యల కంటే, వారికి న్యాయం చేయడం కంటే మంత్రి నారాయణ కానీ, కూటమి ప్రభుత్వం కానీ “ఊడపొడిచేది ఏముంది?” అంటూ ఘాటుగా విమర్శించారు. రాజధాని కోసం త్యాగాలు చేసిన అమరావతి రైతుల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఏబీఎన్ వెంకటకృష్ణ తన లైవ్ కార్యక్రమంలో “కడిగేశారు.” ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా అమరావతి రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

https://x.com/2029YSJ/status/1991898256180490707?s=20

Trending today

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ...

అబద్ధాలను ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఐ జె....

కూటమిపై వ్యతిరేకత… వైసీపీకి అరుదైన చాన్స్!

రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత...

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025...

Topics

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ...

అబద్ధాలను ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఐ జె....

కూటమిపై వ్యతిరేకత… వైసీపీకి అరుదైన చాన్స్!

రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత...

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025...

ఏపీలో పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపు

ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను...

లోటస్ ఫండ్‌కు జగన్… కారణం అదే!

లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్...

వైసీపీ సంచలన నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై...

Related Articles

Popular Categories