Top Stories

మాజీ మంత్రి గుడ్‌ బై!

తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు కొందరు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు వంటి నేతలు ఇప్పటికే తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురాగా, తాజాగా ఆ జాబితాలోకి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల నాటికి తాను క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగి, తన కుమారుడు గంటా రవితేజను పోటీ చేయించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో సైతం గంటా ఇదే తరహా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ విషయమై పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రకాశం జిల్లా నుంచి వ్యాపారరీత్యా విశాఖలో అడుగుపెట్టిన గంటా శ్రీనివాసరావు విశాఖ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఒకసారి ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ విజయం సాధించిన నేతగా గుర్తింపు పొందారు.

గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై 90 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచినా, వివిధ సమీకరణల కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.

ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు కంటే ఆయన కుమారుడు గంటా రవితేజ చాలా చురుకుగా ఉంటున్నారని, ఆయనే ఒక విధంగా షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో నారా లోకేష్ టీమ్‌లో రవితేజ ఉండబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేష్‌కు మద్దతుగా నగరవ్యాప్తంగా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడంలో రవితేజ చొరవ చూపారు.

తన కుమారుడిని ప్రమోట్ చేసే పనిలో ఉన్న గంటా శ్రీనివాసరావు, ఇటీవల పుట్టినరోజు వేడుకల్లో రవితేజ పోటీపై దాదాపుగా క్లారిటీ ఇవ్వడంతో… వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి రవితేజ పోటీ చేయడం దాదాపు ఖాయమనే సంకేతాలు టీడిపి శ్రేణుల్లో బలంగా వెళ్తున్నాయి.

Trending today

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

‘బాబు’ ఎల్లో మీడియా పంథా మారిందా?

టీడీపీ అధినేత చంద్రబాబు 'పంథా మార్చుకున్నాను' అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏడుపులు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య జరిగే మాటల...

అఖండ 2 విడుదల ఎందుకు ఆగిపోయింది?

‘అఖండ 2’ విడుదలపై పెద్ద సందిగ్ధత నెలకొంది. బాలకృష్ణ – బోయపాటి...

Topics

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

‘బాబు’ ఎల్లో మీడియా పంథా మారిందా?

టీడీపీ అధినేత చంద్రబాబు 'పంథా మార్చుకున్నాను' అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏడుపులు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య జరిగే మాటల...

అఖండ 2 విడుదల ఎందుకు ఆగిపోయింది?

‘అఖండ 2’ విడుదలపై పెద్ద సందిగ్ధత నెలకొంది. బాలకృష్ణ – బోయపాటి...

ఏపీలో వైసీపీ సునామి.. నేషనల్ మీడియా రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో 2029 ఎన్నికల దిశగా వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్ రెడ్డి...

‘పచ్చ’ ముఠా కుట్రలు.. మళ్లీ మొదలెట్టింది..

వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమూరు ‘పచ్చ’ ముఠాపై, ముఖ్యంగా నిన్న...

బాలయ్యకు ఏంటి బాధ? 

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’...

Related Articles

Popular Categories