ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం నిర్వహించిన యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ అంశంపై ఆయన పౌరవిమానయాన శాఖ తీరును ప్రశ్నించడం, మంత్రి రామ్మోహన్నాయుడు స్పందించకపోవడంపై చేసిన కామెంట్లు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.
ఇండిగో ఎయిర్లైన్స్ వివాదం నేపథ్యంలో వెంకటకృష్ణ గారు లైవ్ డిబేట్లో “పౌరవిమానయాన శాఖ ఏం చేస్తుందని?” సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా, మన తెలుగు బిడ్డ అయిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఎందుకు ఈ విషయంలో యాక్టివ్గా పట్టించుకోవడం లేదు, ఎందుకు అలర్ట్గా లేరు అంటూ నిలదీయడం చర్చనీయాంశమైంది.
అసలు ఈ వివాదంలో తప్పు ఎవరిది? ఇండియానా? లేక ఇండిగో ఎయిర్లైన్స్నా? అని ఆయన ప్రశ్నించిన విధానం, సమస్య తీవ్రతను తెలియజేసేలా ఉంది.
వెంకటకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న నిష్పాక్షికతను పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం దీనిపై తీవ్రమైన సెటైర్లు పడుతున్నాయి. ముఖ్యంగా, ‘ఎల్లో మీడియా’పై ఉన్న సాధారణ విమర్శల నేపథ్యంలో, నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. “వీలు దొరికితే టీడీపీ తప్పును కూడా ఏబీఎన్ వెంకటకృష్ణ వైసీపీ అధినేత జగన్ మీద తోసేసేవాడే. కానీ ఈ విషయంలో చాన్స్ లేకనే జగన్ను వదిలేసినట్టుగా కనిపిస్తోందని” నెటిజన్లు తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు.
మరికొందరు నెటిజన్లు అయితే, “అంత కష్టమెందుకు???…. జగన్ మీద తోసెయ్యిచ్చు కదా యెల్లో మీడియా??” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలుగు మీడియాలో కొన్ని వర్గాలు ప్రతి అంశంలోనూ వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాయనేది వారి భావన. ఇప్పుడు ఇండిగో వంటి జాతీయ స్థాయి సమస్యలో, జగన్కు సంబంధం లేకపోయినా, టీడీపీకి అనుకూలమైన మీడియా ఆయనపై నింద వేయడానికి ప్రయత్నించకపోవడంపైనే ఈ వ్యంగ్య వ్యాఖ్యలు వచ్చాయి.

