పాపం పవన్ కళ్యాణ్

ఒక్క జగన్ ను ఓడించడానికి కూటమికట్టి.. ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించి.. చచ్చుబడిన చంద్రబాబును లేపి పవన్ కళ్యాణ్ చేసిన పొత్తుల రాజకీయం ఆయనకు అధికారాన్ని ప్రాప్తించేలా చేసింది. అయితే పొత్తులతో గెలిచిన పవన్ కు ఇప్పుడు అధికారులు సరైన గౌరవం ఇవ్వడం లేదని.. డిప్యూటీ సీఎం అయిన తన పరిస్థితే ఇలా ఉందని స్వయంగా ఆయన ఆవేదన చెందిన వైనం వైరల్ అవుతోంది..

జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలో కూర్చొని కంటిచూపుతో పాలించేవారు. అధికారులు, నేతలను పరుగులు పెట్టించేవారు. అంతలా అధికార వర్గంపై ఆయన మార్క్ ఉండేది.

అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు చెప్పినా మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు అస్సలు ఇసుక విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండడంతో దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ప్రతిపక్షంలో కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరులుతున్న బియ్యం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కే రెండు నెలలుగా కాకినాడ పోర్ట్ లో ఎంట్రీ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులు డిప్యూటీ సీఎం అయిన తనకు గౌరవం ఇవ్వడం లేదని.. నన్నే ఆపేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఇలా కూటమి ప్రభుత్వంలో అధికారులు, మంత్రులు, నేతలు ఎవరూ చంద్రబాబు, పవన్ ను గుర్తించడం లేదని.. పొత్తులతో ఆధారపడి గెలిస్తే ఇలానే చూస్తారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.