బాబు చీప్ డైవర్షన్

ఎన్నికలు ఐదేళ్లకోసారి జరుగుతాయి. ప్రభుత్వాలు మారుతుంటాయి. అయితే ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్న ఏ పారిశ్రామిక వేత్త తాము రాష్ట్రాల్లో పెట్టే పెట్టుబడులకు గ్యారంటీ ఇవ్వమని అడగడు…అలా అడిగారు అని చెప్పారు అంటే అది ఒక పొలిటికల్ నారేటివ్ తప్ప ఇంకేమిలేదు.. పెట్టుబడులు, పరిశ్రమలు తేవడానికి చేత కానప్పుడు ఇలాంటి చీప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు.

ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇదే చేస్తోంది. చీప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.చంద్రబాబు, లోకేష్ నుంచి ఏబీఎన్ వెంకటకృష్ణ వరకూ ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు రాకపోవడానికి జగనే కారణమని ఆరోపిస్తున్నారు. తమ చేతకాని తనాన్ని.. పెట్టుబడులను తీసుకురాలేకపోతున్న అసహాయతను అంతా జగన్ పై తోసేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రూపాయి పెట్టడానికి రాకపోవడంతో దీన్ని డైవర్ట్ చేస్తూ జగన్ వల్లనే రావడం లేదని.. ఆయన అధికారంలోకి వస్తాడని భయంతో పెట్టుబడులు రావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు.

ఏపీకి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని తాజాగా లోకేష్ కామెంట్ చేయడం నవ్వులపాలైంది. జగన్ ను ఎదుర్కొని వచ్చేసారి గెలవమని లోకేష్ కు కూటమికి అర్థమైపోయినట్టు కనిపిస్తోంది.

ఎంతలా జగన్ ను టార్గెట్ చేస్తున్నారంటే.. విద్యుత్ చార్జీల పెంపునకు జగన్ దే తప్పు అని.. పోలవరం నిర్మాణం పూర్తి కాకపోవడానికి జగనే కారణమని.. ఆరోపిస్తున్నారు. మీడియా ఉంది కదా అని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప రియాలిటీలో బాబు చీప్ డైవర్షన్ పాలిటిక్స్ ను జనం నమ్మేలా కనిపించడం లేదు.

వీడియో కోసం క్లిక్ చేయండి