ఆయ్ అండీ.. బాబు గారిని చెడుగుడు ఆడాడండీ!

గోదావరి యాస కుర్రాడు మళ్లీ వచ్చేశాడండీ.. ఈసారి బాబు పాలనలోతులను ప్రశ్నిస్తూ రంగంలోకి దిగేసి టీడీపీని కాస్త గట్టిగానే ప్రశ్నించాడండీ.. ఈ యాసకు టీడీపీ బరెస్ట్ కాలేదంటే నమ్మండీ.. ఔనండీ బాబు గారి పాలన వైఫల్యాలపై పలికిన పలుకులు చూస్తుంటే పంచ్ ఫలక్ నామాకే పంచ్ లా ఉందండీ బాబూ..

కామన్ మ్యాన్ లా మాట్లాడిన ఈ యువకుడు.. బాబు గారి ‘తల్లికి వందనం’పై సెటైర్లు వేశాడు. ఇది తండ్రికి ఇంధనంగా మారిందని మండిపడ్డారు. అయ్యా జీతం, అమ్మా జీతం అంటూ రోడ్డెక్కి బాబుగారికి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం ఏంటి? ఏది ఎగ్గొట్టినా అందరూ గమ్మున కూర్చుండడం లేదా? మీరు అలానే చేయండి నిలదీశాడు.

సర్కారు బడుల్లో సీబీఎస్ఈ సిలబెస్ తీసేసి పెత్తందారి కార్పొరేట్ పాఠశాలలకే పెడుతున్న చంద్రబాబు తీరును ఆ పేద పిల్లలు ఎవరూ ప్రశ్నించడం లేదు కదా? మీరెందుకు జీతాల కోసం రోడ్డెక్కుతున్నారని మండిపడ్డారు.

ఇక జనవరి 1న కొత్త సంవత్సరంతోపాటు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్న చంద్రబాబు అది ప్రకటించకుండానే వదిలేశాడు. ఎవరైనా ప్రశ్నించారా? ఏంటి? అంటూ నిలదీశారు. ఉచిత ఇసుక ఇస్తానంటూ కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు దోచుకుంటుంటే క్వశ్చన్లు వేస్తారా? అంటూ నిలదీశారు.

40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి కుప్పం బస్టాండులో బస్టాండ్ కట్టని బాబుకు ఓటు వేసి గెలిపించి ఇప్పుడు ధర్నాలు చేస్తారేంటి? సొమ్ము ఒకడిది.. సోకు ఒకరిది విశాఖలో జగన్ అభివృద్ధి చేస్తే దాన్ని క్యాష్ చేసుకుంటున్న బాబును ఎవరైనా నిలదీస్తున్నారా? అంటూ కాస్త గట్టిగానే పంచులు వేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి