ఎవరో వచ్చి ఏపీలో కొలువైన కూటమి ప్రభుత్వాన్ని చెడగొట్టాల్సిన అవసరం లేదు.. ఒక్క ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చాలు.. అందులోని ఏబీఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ అయితే ఇంకా నయం.. ఆయన ఒక్కడే ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని కూల్చగలడు. తన చర్చలతో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని దించగలడు..
అవును నిజంగా నిజమిదీ.. ఏపీలో హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ తో ప్రజలను ఏమారుస్తోంది. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో రాత్రి పెట్టిన చర్చ చూస్తే ఎవరికైనా అదే అనుమానం కలుగక మానదు.
ఏపీలో కూటమి పార్టీల మధ్య సఖ్యత అంతా నటనేనా? లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చను బీజేపీ మొదలుపెట్టిందా? టీడీపీతో విడిపోయేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా? జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నారా? బీజేపీ కావాలనే చిరంజీవి, పవన్ లను లేపుతోందా? కూటమి పార్టీల వ్యవహారంలో కాంగ్రెస్ వేలుపెడుతోంది అంటూ అన్నీ అనుమానాలను సృష్టించి బీజేపీని విలన్ ను చేసి పవన్ ను చంద్రబాబును విడగొట్టాలని ఏబీఎన్ వెంకటకృష్ణ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
మరి బాబు గారిని నెత్తిన పెట్టుకొనే రాధాకృష్ణ ఇలా తన కూటమి ప్రభుత్వాన్నే ఇలా టార్గెట్ చేయడంతో చంద్రబాబు ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.