ఏరు దాటేదాక ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న.. ఇలా ఉంటోంది టీడీపీ రాజకీయం.. అవును చంద్రబాబు ఏక్ నంబర్ అయితే.. ఆయన కుమారుడు నారా లోకేష్ దస్ నంబర్ లాంటోరు.. అవును చంద్రబాబును మించి జగన్ ను, వైసీపీని తన పచ్చమీడియాతో డ్యామేజ్ చేశారు.
నాడు ఇదే జగన్ దావోస్ వెళ్లి పెట్టుబడులను లక్షకోట్లకు పైగానే సమీకరించారు. అయితే మన దగ్గరి గ్రీన్ కో, అదానీలతోనే జగన్ పెట్టుబడులు చేసుకున్నారని ఇదే లోకేష్ గతంలో దారుణంగా విమర్శించాడు.
కట్ చేస్తే.. తండ్రితోపాటు దావోస్ వెళ్లిన లోకేష్ బాబు ఏం సాధించారయ్యా అంటే.. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చేశారు. ఇప్పుడు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారని విలేకరులు ప్రశ్నిస్తే.. ‘దావోస్ వెళ్లేది పెట్టుబడుల కోసం కాదని.. ప్రజేంటేషన్ కోసమని.. అన్నీ మాట్లాడుకొని ఇప్పుడు తాము ఒప్పందాలు చేసుకుంటామని చావు కబురు చల్లగా చెప్పుకొచ్చారు.
ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ మాట్లాడిన మాటలను.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిన వీడియోలను పెట్టి నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.