Top Stories

కూటమికి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకబడ్డ అభ్యర్థి!

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మరియు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కృష్ణ-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపులో కూటమికి ఊహించని షాక్ తగిలింది. కూటమి నేరుగా అభ్యర్థిని నిలపకపోయినప్పటికీ, ఏపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అయితే, మొదటి రౌండ్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ తన ప్రధాన ప్రత్యర్థి పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడుకంటే వెనుకబడ్డారు.

ఈ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ పోటీ చేయగా, పిఆర్టియు నుంచి మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, యుటిఎఫ్ తరఫున విజయ గౌరీ బరిలో నిలిచారు. త్రిముఖ పోటీలో హోరాహోరీ పోటీ నెలకొంది. కూటమి మద్దతుతో రఘువర్మ విజయం సాధిస్తారని భావించినా, మొదటి రౌండ్ ఫలితాలు భిన్నంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తొలి రౌండ్లో మొత్తం 20,783 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 19,813 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఈ లెక్కింపులో గాదె శ్రీనివాసుల నాయుడుకు 7,210 ఓట్లు రాగా, రఘువర్మ 6,835 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో పిడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరీ 5,810 ఓట్లను సంపాదించారు.

ఇప్పటివరకు ఎవరికీ గెలిచేంత ఆధిక్యం లభించలేదు. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. త్రిముఖ పోటీ నేపథ్యంలో గెలుపెవరిదో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.

Trending today

కూటమిలో పొత్తుకు ప్రమాదం.. పసిగట్టిన పవన్

జనసేన నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా...

ఏబీఎన్ ఆర్కేను జైలుకు పంపుతాం

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ (ఆర్కే)పై బీఆర్ఎస్ నాయకులు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....

జగన్ వస్తున్నాడంటే ఆ మాత్రం ఉండాలి

ఈనెల 9వ తారీఖున చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలంలోని...

టీడీపీలో టెన్షన్!

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామ రైతులు ల్యాండ్ పూలింగ్...

లోకేష్ మనసులో మాట

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు...

Topics

కూటమిలో పొత్తుకు ప్రమాదం.. పసిగట్టిన పవన్

జనసేన నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా...

ఏబీఎన్ ఆర్కేను జైలుకు పంపుతాం

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ (ఆర్కే)పై బీఆర్ఎస్ నాయకులు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....

జగన్ వస్తున్నాడంటే ఆ మాత్రం ఉండాలి

ఈనెల 9వ తారీఖున చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలంలోని...

టీడీపీలో టెన్షన్!

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామ రైతులు ల్యాండ్ పూలింగ్...

లోకేష్ మనసులో మాట

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు...

కేంద్రానికి బాబుపై ఐఏఎస్, ఐపీఎస్ ల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొందరు ఐఏఎస్, ఐపీఎస్...

భయపడ్డ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

'కొత్త పలుకు'లో బీఆర్ఎస్ తెలంగాణ జాగీరా అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ రాసిన...

బాబు రిటర్న్ గిఫ్ట్

రాష్ట్రంలో రేషన్ పంపిణీ తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది....

Related Articles

Popular Categories