Top Stories

కూటమి సర్కార్‌పై కుర్రాడి కుతకుత

 

ఏటిగట్టున కూసోని సూడుంటే ఈ రాజకీయ నాయకులు చేసే పనులు చూసి నవ్వాలో ఏడ్వాలో తెల్వట్లేదని గోదావరి యాసలో ఓ యువకుడు తన సెటైర్లతో ఏకిపారేశాడు. మొన్న ఎన్నికలప్పుడు ఊరూరా తిరిగి దండాలు పెట్టి ఓట్లు అడుక్కున్నారు. గెలిచాక మొఖం కూడా సూపించట్లేదు. మన గోదావరి జిల్లాల్లో అయితే మరీ దారుణం. కూటమి సర్కార్ అంట! కూడి ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఒక పక్కన వాలంటీర్లు గొల్లుమంటున్నారు. ఎలక్షన్ల ముందు వీళ్ళే కదా ఊరూరు తిరిగి ఓట్లు వేయమని బతిమాలింది. అప్పుడు మంత్రి నిమ్మల గారు వచ్చి “మీకు పదివేల జీతం గ్యారెంటీ. పూత రేకులు తెచ్చి మీ చేతుల్లో పెడతా” అని తెగ ఊదరగొట్టారు. ఇప్పుడు అడిగితే మొఖం చాటేస్తున్నారు. ఆ పూత రేకులు ఏమైనాయో? కనీసం ఆ మాటేమైనా గుర్తుందా? వాలంటీర్లు మాత్రం “మాకు పదివేలు ఇయ్యాల్సిందే” అని నిలదీస్తున్నారు. పాపం, వాళ్ళ బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది.

ఇంకో పక్కన రైతుల గోడు వినే నాథుడే లేడు. అసెంబ్లీలో ఏమో రైతుల సమస్యల గురించి మాట్లాడకుండా ఆటల పోటీల్లో మునిగి తేలుతున్నారట మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఊర్లో రైతులు పంట పండక, అప్పుల బాధతో చస్తుంటే వీళ్ళేమో కుర్చీలాటలు ఆడుకుంటున్నారు. సిగ్గుండాలి కొంచెం. రైతుల కష్టాలు పట్టించుకోకపోతే ఎట్లా? రేపు మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది?

ఇక మంత్రుల సంగతి చెప్పక్కర్లేదు. తొమ్మిది నెలలు గడిచినా ఏం చేశారో వాళ్లకే తెలీదు. సొంతంగా వాళ్లే “మేం ఏం చేయలేకపోతున్నాం” అని వాపోతున్నారట. మరి ఎందుకు కుర్చీల్లో కూర్చున్నారు? దిగిపోవచ్చు కదా! జనం ఓట్లు వేసింది మీరు ఏదో చేస్తారని కదా? ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎట్లా?

మొత్తానికి ఈ కూటమి సర్కార్ గోదాట్లో మునిగిన ఏనుగులా తయారైంది. కదలదు, మెదలదు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి. జనం మాత్రం అయోమయంలో ఉన్నారు. ఈ నాయకులు ఎప్పుడు మారతారో? మన గోదావరి గడ్డ మీద మంచి పాలన ఎప్పుడు చూస్తామో? అని ఆశగా ఎదురు చూస్తున్నాం. కానీ ఈ తీరు చూస్తుంటే ఆశ కూడా చచ్చిపోయేలా ఉంది.

ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories