పోలీస్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారని, గత ఎన్నికల్లోనే ఆయనకు టికెట్ రావాల్సి ఉండగా, ఎస్ఐగా ఉంటూనే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నారని సమాచారం. ఆయన నారా లోకేష్, చంద్రబాబు నాయుడులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ బండారం బయటపెట్టాడు. ఆస్తులను మీడియా ముందు పెట్టారు. సుధాకర్ యాదవ్ టీడీపీ నేతలతో కలిసి అక్రమాలకు పాల్పడి ఫాంహౌస్లు, ఖరీదైన కార్లు, స్థలాలు సంపాదించారని ఆయన ఆరోపించారు. కేవలం 5 ఎకరాల భూమి ఉన్న సుధాకర్ యాదవ్ కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని తోపుదుర్తి ప్రశ్నించారు.
అంతేకాకుండా సొంత కొడుకుకే ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోలేని సునీత, సుధాకర్ యాదవ్ కు టికెట్ ఇప్పిస్తుందని ఎలా అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మరోవైపు గతంలో టీడీపీ నేత అచ్చెమ్ నాయుడు పోలీసులను దుర్భాషలాడినప్పుడు, పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు పోలీసులను కొట్టినప్పుడు స్పందించని వారు, ఇప్పుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి, పోలీసు అధికారిగా ఉంటూ రాజకీయ ఆశలు పెట్టుకున్న సుధాకర్ యాదవ్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి ఇది మరింత ఆజ్యం పోసింది.
వీడియోhttps://x.com/greatandhranews/status/1909840718295712218