Top Stories

రఘురామ షాకింగ్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార కూటమికి చెందిన ఒక ముఖ్య నేత తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తన సొంత నియోజకవర్గంలో ఒక కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన కోరడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొందిన రఘురామకృష్ణం రాజుకు చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగించారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకత్వాన్ని గట్టిగా వ్యతిరేకించి, టిడిపిలోకి వచ్చిన ఆయన ఇప్పుడు అధికారంలో ఉంటూ కూడా ఒక నిరసన తరహా కార్యక్రమానికి పిలుపునివ్వడం విశేషం. ఈ వ్యవహారంపైనే రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తన గళం మరోసారి వినిపించాలన్న ఉద్దేశంతోనే రఘురామ ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు సమాచారం.

నేపథ్యం: వైఎస్సార్‌సీపీతో విభేదాలు – రాజద్రోహం కేసు

రఘురామకృష్ణం రాజు రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే, గెలిచిన ఆరు నెలల్లోపే పార్టీ నాయకత్వంతో ఆయనకు తీవ్ర విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఆయన వైఎస్సార్‌సీపీ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తూ, ఇరుకున పెడుతూ వచ్చారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే, నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదని స్పీకర్ తేల్చి చెప్పారు.

ఈ క్రమంలోనే 2021 మే 14న రఘురామకృష్ణం రాజుపై నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసింది. మతాలను రెచ్చగొడుతూ, వర్గ విభేదాలకు కారణమవుతున్నారని ఆరోపిస్తూ ఆయన్ను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ ఆరోపించడంతో, ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పట్లో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన కోర్టు.. రఘురామకృష్ణం రాజును విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకత్వంపై ఆయన మరింత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేవారు.

టిడిపిలో ప్రవేశం – డిప్యూటీ స్పీకర్ పదవి

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రఘురామకృష్ణం రాజు బీజేపీలో చేరి నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే, చివరి నిమిషంలో ఆ సీటు భూపతి రాజు శ్రీనివాస వర్మకు దక్కింది. దీంతో చంద్రబాబు నాయుడు రఘురామను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. అక్కడ రఘురామ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి ఆశించినప్పటికీ, అది దక్కలేదు. చివరకు డిప్యూటీ స్పీకర్ పదవిని పొందారు. అయితే, తనపై గతంలో మోపిన రాజద్రోహం కేసు విషయంలో ఆయన ఇప్పటికీ గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి తగిన గుర్తింపు లేదా ప్రతిఫలం లభించలేదన్న భావన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రేపు ‘ప్రతీకార దినోత్సవం’

తాజాగా, రఘురామకృష్ణం రాజు రేపు (మే 14న) ఉండి నియోజకవర్గంలో ‘ప్రతీకార దినోత్సవం’ జరపనున్నారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం, అంటే 2021 మే 14న తనపై రాజద్రోహం కేసు నమోదైన రోజు కావడంతో ఈ కార్యక్రమానికి ఆయన ఈ పేరు పెట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాదిరిగా కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేయడం లేదని సంకేతాలు పంపుతూనే.. తనపై జరిగిన అన్యాయాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేసేలా ఈ కార్యక్రమం నిర్వహణకు ఆయన ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంతో మరోసారి రఘురామ పేరు రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తోంది. రేపు జరగనున్న ‘ప్రతీకార దినోత్సవం’ను ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఈ కార్యక్రమం ద్వారా జగన్ పాలనలో జరిగిన వైఫల్యాలను, ముఖ్యంగా తనపై జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారంలో ఉన్న ఒక డిప్యూటీ స్పీకర్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం కూటమిలో ఏ మేరకు చర్చకు, లేదా ఆందోళనకు దారితీస్తుందో, ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

Trending today

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

ఆడవాళ్ల వస్త్రాధారణపై నాగబాబు సంచలన కామెంట్స్

సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, ముఖ్యంగా స్త్రీల హక్కులకు మోరల్ పోలీసింగ్ పెద్ద...

సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ...

చెత్త నా కొడుకులు.. బ్రోకర్లు.. రఘురామ బండ బూతులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో...

Topics

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

ఆడవాళ్ల వస్త్రాధారణపై నాగబాబు సంచలన కామెంట్స్

సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, ముఖ్యంగా స్త్రీల హక్కులకు మోరల్ పోలీసింగ్ పెద్ద...

సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ...

చెత్త నా కొడుకులు.. బ్రోకర్లు.. రఘురామ బండ బూతులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో...

పచ్చ మీడియా పక్షపాతం

తెలంగాణ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. కానీ, ఇటీవల కొన్ని...

మెడికల్ కాలేజీల టెండర్లు.. ప్రభుత్వ పరువుపాయే

ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి టెండర్ వేసిందన్న...

మా అయ్య మొగోడు, మొనగాడు.. తెలంగాణ తెచ్చినోడు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...

Related Articles

Popular Categories