Top Stories

కూటమిపై కేఏ పాల్ కామెడీ..

అబ్బో… ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచీ పండుగలు, పబ్బాలు, పలహారాలు… ఇలా ఏ లోటూ లేకుండా చూసుకుంటోంది. ముఖ్యంగా “తల్లికి వందనం” పథకం గురించి మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏప్రిల్, మే నెలల్లోనే అమలు చేస్తామని స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెల మూడో వారం దాటినా, తల్లుల బ్యాంకు ఖాతాల్లో “వందనం” జాడ కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం కూటమిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఇందులో నవ్వాల్సింది ఏముందండి? ఇది కూటమి దూరదృష్టి!

కేఏ పాల్ గారు చెప్పినట్టు, ఇది కేవలం “తల్లికి వందనం” మాత్రమే కాదు, ఒక కుటుంబ సంక్షేమ, పలహార సమగ్ర విప్లవం! మీరు విన్నది నిజమే. తల్లులకు “వందనం” అందేలోపే, అసలు పథకం ఏంటో పాల్ గారు క్లారిటీ ఇచ్చేశారు.

పాల్ గారు రిలీజ్ చేసిన, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ప్రకారం… తల్లికి వందనం.. తండ్రికి అప్పడాలు.. తాతకు పబ్బడాలు.. మామ్మకు ముంజలు.. అత్తకు అరటికాయలు.. మామలు, బామ్మర్ధులు, మరదళ్లకు ఉసిరికాయలు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందంటూ సెటైర్లు వేశారు.

మొత్తానికి, కేవలం నగదు బదిలీలే కాకుండా, పలహారాల బదిలీ కూడా కూటమి లక్ష్యం అని స్పష్టంగా అర్థమవుతోంది. సోషల్ మీడియాలో విమర్శలు, వ్యంగ్యాలు వెల్లువెత్తుతున్నప్పటికీ, కూటమి మాత్రం తన ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టుంది.

కాబట్టి, ఇంకెవరైనా నవ్వాలనుకుంటే ఒకసారి పాల్ గారి వీడియో చూసి, ఆయన చెప్పినట్టు “హే నవ్వకండే!” అంటారు. ఎందుకంటే, త్వరలోనే మన తల్లులు, తండ్రులు, తాతలు, మామ్మలు, అత్తలు, మామలు, బామ్మర్ధులు, మరదళ్లు… అందరూ కడుపునిండా తిని, పలహారాల మత్తులో మునిగి తేలుతున్నప్పుడు, నవ్వడానికి ఓపిక ఎక్కడుంటుందండి! కాబట్టి, ఓపిక పట్టండి, పలహారాల వాన త్వరలో కురవబోతోంది!

వీడియో కోసం క్లిక్ చేయండి
వీడియో

 

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories