Top Stories

మనిషివా.. ‘జేసీ’వా?

 

తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజ నాయుడుపై వీరంగం సృష్టించారు. తాను చెప్పిన పనులు చేయలేదనే ఆగ్రహంతో డీపీఓను అందరి ముందు ఇష్టమొచ్చినట్లు తిట్టడమే కాకుండా, బూతులు తిడుతూ బెదిరింపులకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తన ఆదేశాలను పాటించకపోతే అంతు చూస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి డీపీఓను బెదిరించినట్లు తెలుస్తోంది. “బీ కేర్‌ఫుల్‌.. రేపు మీ ఆఫీస్‌కు వ‌చ్చి కొడ‌తా” అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. ఒక ప్రజాప్రతినిధి, పైగా మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ అధికారి పట్ల ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “ఇదేనా ఏపీ సీఎం చంద్రబాబు తన టీడీపీ నేతలకు నేర్పిన సంస్కారం?” అంటూ సామాజిక మాధ్యమాల్లో నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన సమయంలో ఇలాంటి అనుచిత ప్రవర్తన శోచనీయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

https://x.com/YSRCParty/status/1945889961305338252

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories