Top Stories

అసెంబ్లీకి హాజరు.. ఇక కాచుకోండి అంటున్న జగన్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై స్పష్టత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనంతవరకు సభకు రాబోమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రతిపక్ష హోదా లభిస్తేనే సభలో తగినంత సమయం లభిస్తుందని, ప్రజల సమస్యలపై సమర్థవంతంగా పోరాడొచ్చని జగన్ వాదిస్తున్నారు. అయితే, సభకు హాజరైతే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై అధికారబలంతో ఎదురుదాడి చేసే అవకాశం ఉందని ఆయన అండ్ కో భావిస్తున్నారు. సభలో అవమానాలు ఎదుర్కోవడం కంటే, గైర్హాజరు కావడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని సమాచారం.

అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలపై గళమెత్తాలని జగన్ నిర్ణయించుకున్నారు. సభకు హాజరైతే కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం వస్తుందని, కానీ ప్రజల మధ్య ఉంటే ఎక్కువ సమయం పాటు ప్రజా సమస్యలను వివరించవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇది ప్రజల్లో సానుభూతిని పెంచుతుందని, పార్టీకి భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందని ఆయన నమ్మకం. ఈ నిర్ణయం ప్రజల్లో కొంత చర్చకు దారితీసినా, దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్ ప్రజాక్షేత్రంలో పర్యటించనున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార కూటమి అసెంబ్లీలో తమ బలాన్ని ప్రదర్శించగా, వైసీపీ ప్రజల మధ్య తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో ఈ రెండు వ్యూహాలు ఏ ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.

Trending today

ఫోన్ ట్యాప్.. 10 కోట్లు డిమాండ్.. TV5 మూర్తిపై కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు...

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

టీవీ5 సాంబశివరావు హైజాక్ చేశారు.

భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన...

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

Topics

ఫోన్ ట్యాప్.. 10 కోట్లు డిమాండ్.. TV5 మూర్తిపై కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు...

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

టీవీ5 సాంబశివరావు హైజాక్ చేశారు.

భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన...

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

Related Articles

Popular Categories