ఆంధ్రప్రదేశ్లో భావప్రకటన స్వేచ్ఛపై మరోసారి కత్తెర పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు హెచ్చరికలకూ వెనుకాడకుండా టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు మరింత తీవ్రం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నెల 9న సీఐడీ ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే అందులో ఎవరిపైనా స్పష్టంగా కేసు నమోదు చేయకుండా, నిందితుల కాలమ్లో కేవలం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింకులను మాత్రమే పేర్కొంది. దీని వెనుక ఉద్దేశ్యం, ప్రభుత్వం విమర్శించే ఎవరినైనా ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా అరెస్టు చేయడమేనని కార్యకర్తలు అంటున్నారు.
గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 282 కేసులు సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదయ్యాయి. 84 మందిని అరెస్టు చేశారు. కోర్టులు ఇప్పటికే పోలీసుల చర్యలను రాజ్యాంగ విరుద్ధమని ఖండించినా, ఇప్పుడు కొత్త ఎత్తుగడతో సీఐడీని రంగంలోకి దింపారు.
పౌరహక్కుల సంఘాలు దీన్ని “అప్రకటిత ఎమర్జెన్సీ”గా పిలుస్తూ, రాజ్యాంగ హక్కులను నిర్లక్ష్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చర్యగా అభివర్ణిస్తున్నాయి.