సినీ పరిశ్రమ, రాజకీయాలు మిళితమయ్యే దశలో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మెగాస్టార్ చిరంజీవికి అవమానం జరిగిందని అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోకస్ చేయడం.. దానికి అప్పట్లో స్పందించని ఆయన, తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై మాత్రం స్పందించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ అవమానంపై పలు మార్లు నిలదీసినా చిరంజీవి మౌనంగా ఉండిపోయారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందిస్తూ, “ఆ రోజుల్లో కరోనా నిబంధనల కారణంగా మాత్రమే కొద్దిమందితో కలిశాను” అని వివరణ ఇచ్చారు. జగన్ బాగానే ఆహ్వానించారు.. సత్కరించారు అవమానం జరగలేదని క్లారిటీ ఇచ్చారు.
దీంతో తెర వెనుక టీడీపీ , బాలయ్య కుట్ర ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో ఎవరి ప్రభావం ఉందనే సందేహాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రభావితులు రగడ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.
పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు, రాజకీయాలు వేర్వేరని.. ప్రజల కోసం టిడిపితో కలిసి పనిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక చిరంజీవి తాజా వ్యాఖ్యలు ఏ దిశలోకి దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది.