Top Stories

కూటమి పాలనపై ఆర్కే రివ్యూ

ఏపీ కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పాలనను పూర్తి చేసుకుని రెండవ ఏడాదిలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ విశ్లేషకులు, మీడియా సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. చాలా వరకు మీడియా నివేదికలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండగా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాత్రం తనదైన శైలిలో షాక్ ఇచ్చింది.

ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఛానల్‌గా పేరు తెచ్చుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఈసారి మాత్రం ఊహించని విధంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపింది. ఛానల్ ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ తన తాజా రిపోర్ట్‌లో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి, అక్రమ భూకబ్జాలు, ఇసుక మాఫియా, స్మార్ట్ మీటర్ల వ్యవహారాలు, రెగ్యులర్ పాలనలో అవ్యవస్థలు వంటి అంశాలపై రాధాకృష్ణ విమర్శనాస్త్రాలు సంధించారు.

గతంలో వైసీపీ ప్రభుత్వంపై ఇదే ఛానల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. అప్పట్లో భూదందాలు, సెటిల్మెంట్లు, ఇసుక అక్రమాలు అధికంగా ఉన్నాయంటూ అనేక కథనాలు ప్రసారం చేసింది. కానీ ఇప్పుడు అదే ఛానల్ కూటమి ప్రభుత్వాన్నీ ఇలాంటి ఆరోపణల నుండి మినహాయించడం లేదు. ఇప్పుడూ ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయన్నది ఏబీఎన్ ఇచ్చిన సంకేతం.

ఈ రిపోర్టుతో చంద్రబాబుకే ఏకంగా హెచ్చరికలు ఇచ్చినట్టు వ్యవహరించడమే గాక.. ఈ ప్రభుత్వం పాలనలో పారదర్శకత లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు అనుచరుల్లో ఆందోళనకు దారితీస్తోందని తెలుస్తోంది.

వైసీపీ సోషల్ మీడియా విభాగం ఈ కథనాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ‘చంద్రబాబు మౌత్‌పీస్’గా పేరుగాంచిన ఏబీఎన్ ఛానల్ నుంచే ఇలాంటి విమర్శలు రావడం ఆశ్చర్యకరమని పేర్కొంటూ.. కూటమి పాలనలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని అంటోంది.

మరోవైపు, ఏబీఎన్ రాధాకృష్ణ ఇలా విమర్శలు గుప్పించడంలో అంతర్లీన కారణాలు ఉన్నాయంటూ.. తెర వెనుక రాజకీయం జరిగిందని టిడిపి వర్గాలు అనుమానిస్తున్నట్టు సమాచారం. ఇది నిజం కాని అపోహనా అన్నది త్వరలోనే తేలనుంది.

ఏదేమైనా.. ఈ రిపోర్టుతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయడం ఖాయం.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories