Top Stories

మళ్లీ ‘అమరావతి’ ఉద్యమం

అమరావతి రైతుల్లో మరోసారి ఆందోళన చెలరేగుతోంది. రాజధానికి పూర్తి చట్టబద్ధత కల్పించి, భవిష్యత్తులో ఎవరూ కదిలించలేని స్థితికి తీసుకెళ్లాలని వారు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలు, మూడు రాజధానుల వివాదం—ఇవన్నీ రైతుల్లో మళ్లీ ఉద్యమ భావనను రగిలిస్తున్నాయి.

ఏకాభిప్రాయంతో అమరావతి ఎంపిక

2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాతే అమరావతి రాజధానిగా నిర్ణయించబడింది. విభజన అనంతరం ఏపీకి రాజధాని లేకపోవడంతో పాలన గాడిలో పడేందుకు కొంత సమయం పట్టింది. అనంతరం అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమైనా, చట్టబద్ధత కల్పించడం మాత్రం అప్పట్లో సాధ్యం కాలేదు.

మూడు రాజధానుల నిర్ణయం… ఆర్5 జోన్ వివాదం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కేవలం శాసన రాజధానిగా పరిమితం చేసింది. మిగతా వేల ఎకరాల భూములపై రైతులకు స్పష్టత రాలేదు. ఆపై ఆర్5 జోన్ ప్రకటించి, ఆ భూములను పేదలకు కేటాయించడానికి ప్రయత్నించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్5 జోన్ రద్దు చేస్తారని రైతులు ఆశించినా, ఇంకా స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు.

మళ్లీ ముమ్మరంగా ఐక్య కార్యాచరణ సమితి

ఈ నేపథ్యంలో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి మళ్లీ క్రియాశీలకం అయింది. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన ఈ చర్య, అమరావతి ఉద్యమానికి మరో మలుపు తిప్పే అవకాశం ఉంది.

రైతుల డిమాండ్– ఎప్పటికైనా చట్టబద్ధత కావాలి

గతంలో అమరావతికి చట్టబద్ధత ఇచ్చి ఉంటే, మూడు రాజధానుల అంశం వచ్చేదే కాదని రైతుల అభిప్రాయం. ఇప్పుడు అయినా చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో ఏ రాజకీయ మార్పులైనా అమరావతిపై ప్రభావం చూపదని వారి అభిమతం. పైగా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇది సాధ్యమేనని రైతులు భావిస్తున్నారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో… అమరావతి ఉద్యమం ఏ దిశగా సాగుతుందో అన్నది రాజకీయంగా కీలకంగా మారింది.

Trending today

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Topics

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

Related Articles

Popular Categories