ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ చోరీ ఆరోపణలు కొత్తవి కావు. ఒక్క ప్రాజెక్ట్, ఒక్క కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చుట్టూ కూడా నేతల మధ్య మాటలతూటాలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇదే తరహాలో మంత్రి నారా లోకేష్పై వైఎస్సార్సీపీ వర్గాలు చేస్తున్న విమర్శలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.
వాస్తవానికి, ReNewCorp అనే రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీతో ఒప్పందం 2023లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో కుదిరింది. ఆ సమయంలో రాష్ట్రంలో అధికారంలో వైయస్ జగన్ ప్రభుత్వం. విద్యుత్, పచ్చశక్తి రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ అంగీకరించడం జగన్ హయాంలో జరిగిన ముఖ్య పరిణామాల్లో ఒకటిగా భావించారు.
ఇటీవల ఈ కంపెనీ పెట్టుబడులపై మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనలో ఆ సంస్థను తన ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా చూపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో సంతకం చేసిన ఒప్పందానికే క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలనుకోవడం రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు కారణమైంది.
వైఎస్సార్సీపీ వర్గాలు దీనిపై ఘాటుగా స్పందిస్తూ “జగన్ ప్రభుత్వం రప్పించిన కంపెనీని ఇప్పుడు తన ఖాతా వేసుకునే ప్రయత్నం చేస్తున్నారేంటి? దొరికిపోయారు కదా!” అంటూ లోకేష్పై దాడి చేస్తున్నారు. చంద్రబాబు ఏక్ నంబర్ అయితే.. లోకేష్ దస్ నంబర్ లాగా ఉన్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
https://x.com/JaganannaCNCTS/status/1988911336676577690?s=20

