Top Stories

మహా ‘వంశీ’ని నువ్వే కాపాడాలి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవితోపాటు జగన్‌ గురించిన వ్యాఖ్యలతో బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఎల్లో మీడియా వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రత్యేకంగా మహా టీవీ యాంకర్ వంశీ వ్యవహారం ఇప్పుడు వైరల్ అయింది. బాలయ్య చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏమీ లేదని, చిరంజీవి ఆ విధంగా స్పందించడమే తప్పు అని వంశీ బహిరంగంగానే సమర్థించటం పెద్ద కలకలం రేపింది. అంతేకాదు, ఆర్ నారాయణమూర్తి కూడా చిరంజీవికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దానిని వైసీపీ ప్రచార యంత్రాంగం సోషల్ మీడియాలో విస్తృతంగా ఉపయోగించుకోవడాన్ని వంశీ “కడుపు ఉబ్బరం” అన్నట్టుగా వ్యాఖ్యానించడం మరింత చర్చనీయాంశమైంది.

దీనిపై వైసీపీ అనుబంధ శ్రేణులు వంశీపై విరుచుకుపడ్డారు. “బాలయ్య తప్పు ఏమీ చేయలేదని చెప్పడం అంటే, అసెంబ్లీని అవమానించడం కాదా?” అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాకుండా “టీడీపీకి ఈగ వాలకుండా కాపు కాసే ఎల్లో మీడియా ఇప్పుడు పాపం దేవుడి దెబ్బ తిన్నట్టుంది. అన్ని కష్టాలు ఒకేసారి వచ్చేస్తున్నాయి.. ఇది న్యాయమా?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ ఘటనలతో అసెంబ్లీలో బాలయ్య–చిరంజీవి ఎపిసోడ్ ఒక వైపు, దానికి మీడియా ప్రతిస్పందన మరో వైపు.. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇక వంశీ వ్యాఖ్యలతో ఎల్లో మీడియా పట్ల ప్రతిపక్ష శ్రేణుల్లో ఆగ్రహం మరింత పెరిగింది.

మొత్తానికి బాలయ్య మాటలు, చిరంజీవి స్పందన, ఆర్ నారాయణమూర్తి మద్దతు ఇవన్నీ కలిపి రాజకీయాల్లో కొత్త మంటలు రాజేశాయి. వాటికి వంశీ ‘ఇంధనం’ పోసినట్టయింది.

https://x.com/Samotimes2026/status/1971951217141338493

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories