Top Stories

కష్టం జగన్ ది.. ప్రచారం బాబు ది

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి క్రెడిట్ యుద్ధం చెలరేగింది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈసారి కేంద్ర బిందువుగా మారింది.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పునరుద్ధరించబడి, వేగంగా నిర్మాణ పనులు సాగాయి. జగన్ సర్కార్‌ కాలంలోనే సుమారు 80 శాతం పనులు పూర్తి అయ్యాయని ప్రభుత్వ నివేదికలు, అధికార వర్గాలు అప్పట్లో వెల్లడించాయి. విమానాశ్రయం రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ వంటి కీలక సదుపాయాలు జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి.

అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం, మిగిలిన 10–15 శాతం పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్‌ను ప్రారంభ దశకు తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పార్టీ మీడియా వర్గాలు దీనిని “చంద్రబాబు సాఫల్యం”గా ప్రదర్శిస్తూ, ప్రపంచ స్థాయి విమానాశ్రయంగా అభివర్ణిస్తున్నాయి.

దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. సోషల్ మీడియాలో “జగన్ చేసిన పనిని బాబు హైజాక్ చేశాడు” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి బేస్ వర్క్‌, కాంట్రాక్టులు, భూసేకరణ, ఫండింగ్ అన్నీ జగన్ సర్కారే చేసింది. ఇప్పుడు కేవలం తుది టచ్ ఇచ్చి టీడీపీ డబ్బా కొడుతోంది” అంటూ వైసీపీ కార్యకర్తలు వాదిస్తున్నారు.

ఇక టీడీపీ వర్గాలవైపు చూస్తే, వారు మాత్రం భిన్నమైన వాదన చేస్తున్నారు. “జగన్ సర్కార్ ఆలస్యం చేసింది. ప్రాజెక్ట్‌ సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. చంద్రబాబు తిరిగి స్పీడ్ ఇచ్చి పూర్తి చేశాడు” అని చెబుతున్నారు.

కానీ, ప్రజల దృష్టిలో మాత్రం భోగాపురం విమానాశ్రయం రాజకీయ క్రెడిట్ పోటీకి వేదికగా మారిపోయింది. ఎవరి పాలనలో ఎక్కువ భాగం పూర్తయిందన్నదానికంటే, ఇప్పుడు ప్రజలు ఎదురుచూస్తున్నది – ఈ విమానాశ్రయం ఆపరేషనల్‌ అవ్వడం ద్వారా ఆ ప్రాంతానికి ఎలాంటి ఆర్థిక అభివృద్ధి వస్తుందనేదే.

మొత్తంగా జగన్ వేసిన పునాది మీద బాబు తుది రంగులు పూయించిన ఈ ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కంటే రాజకీయ ప్రతిష్టల పోటీగా మారిపోతోందన్నది వాస్తవం.

https://x.com/Jaganaithene/status/1980859837274812928

Trending today

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

Topics

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

జగన్ మీద తోసెయ్యిచ్చు కదా వెంకటకృష్ణ

ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం...

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

Related Articles

Popular Categories