Top Stories

‘బాబు’ ఎల్లో మీడియా పంథా మారిందా?

టీడీపీ అధినేత చంద్రబాబు ‘పంథా మార్చుకున్నాను’ అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘ఎల్లో మీడియా’ ఈ ప్రచారాన్ని బలంగా వినిపిస్తున్నప్పటికీ, నేలమీద పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజా సమస్యలు, అంతర్గత అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేల దుర్వినియోగం వంటి కీలక అంశాలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న వేళ, పార్టీ అంతర్గత నాయకులకే బెదిరింపులు, హెచ్చరికలు జారీ చేయడం వివాదంగా మారింది. ఇది ప్రభుత్వ పనితీరుపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి చేసిన సీరియస్ ఆరోపణలను పరిశీలించడం బదులుగా, ఆయననే మందలించడం జరిగింది.అదే తరహాలో రైల్వేకోడూరు, విశాఖ, నెల్లూరు ఘటనల్లో వచ్చిన ఆరోపణలపై కూడా సరైన చర్యలు కనిపించడం లేదు. మహిళలపై వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటికీ, బాధితులపై ఒత్తిడి పెంచడమే తప్ప, నిందితులపై చర్యలు తీసుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ‘అవినీతిని ఉపేక్షించను’ అనే మాటలకు, ఇటువంటి అంతర్గత చర్యలకు పొంతన కుదరడం లేదు.

ప్రభుత్వం మరోవైపు, పింఛన్లు, రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడాన్ని ‘పవిత్ర యజ్ఞం’గా ప్రచారం చేస్తూ, తమ వైఫల్యాలపై దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇసుక, మద్యం, గంజాయి వంటి సమస్యలు విస్తృతమవుతున్నాయి.

కొన్ని సర్వేల్లో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు బలహీనంగా ఉందని తేలడం, ‘పంథా మారింది’ అనే ప్రచారం కేవలం ఇమేజ్ మేనేజ్మెంట్ ప్రయత్నం మాత్రమేనా అనే అనుమానాలకు తావిస్తోంది.

రాజకీయ విశ్లేషకులు ప్రకారం.. ప్రజలు ఆశించేది మాటలు కాదు. పనులు. నిజంగా చంద్రబాబు పంథా మార్చుకున్నారని నమ్మాలంటే.. అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలి. పార్టీలో అంతర్గత క్రమశిక్షణ తీసుకురావాలి. పబ్లిక్ ఇష్యూలపై స్పష్టమైన, పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటాలి. అప్పుడే ‘పంథా మారింది’ అనే ప్రచారానికి నమ్మకం దొరుకుతుంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories