Top Stories

పోసానితో సీఐడీ పోలీసుల సెల్ఫీలు.. వైరల్

 

గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను ప్రదర్శించిన కేసులో అరెస్టయిన సినీ నటుడు పోసాని కృష్ణమురళితో సీఐడీ పోలీసులు ఫోటోలు దిగడం వివాదాస్పదంగా మారింది.

గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు, ఆయన్ను కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు.

పోసానిని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరగా, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతి లభించింది. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కు తరలించి, తిరిగి జైలుకు పంపుతుండగా సీఐడీ పోలీసులు ఆయనతో ఫోటోలు దిగారు.

పోసాని జైలులోకి వెళ్లే ముందు, సీఐడీ అధికారులు ఆయనను ఫోటో కోసం అభ్యర్థించారు. ఒక పోలీసు తన ఫోన్ ను సహోద్యోగికి ఇచ్చి పోసాని పక్కన నిలబడి ఫోటో దిగగా, మరొక అధికారి కూడా అదే విధంగా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, రిమాండ్ ఖైదీతో పోలీసులు ఫోటోలు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఆయనకు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories