Top Stories

కూటమిపై కేఏ పాల్ కామెడీ..

అబ్బో… ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచీ పండుగలు, పబ్బాలు, పలహారాలు… ఇలా ఏ లోటూ లేకుండా చూసుకుంటోంది. ముఖ్యంగా “తల్లికి వందనం” పథకం గురించి మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏప్రిల్, మే నెలల్లోనే అమలు చేస్తామని స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెల మూడో వారం దాటినా, తల్లుల బ్యాంకు ఖాతాల్లో “వందనం” జాడ కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం కూటమిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఇందులో నవ్వాల్సింది ఏముందండి? ఇది కూటమి దూరదృష్టి!

కేఏ పాల్ గారు చెప్పినట్టు, ఇది కేవలం “తల్లికి వందనం” మాత్రమే కాదు, ఒక కుటుంబ సంక్షేమ, పలహార సమగ్ర విప్లవం! మీరు విన్నది నిజమే. తల్లులకు “వందనం” అందేలోపే, అసలు పథకం ఏంటో పాల్ గారు క్లారిటీ ఇచ్చేశారు.

పాల్ గారు రిలీజ్ చేసిన, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ప్రకారం… తల్లికి వందనం.. తండ్రికి అప్పడాలు.. తాతకు పబ్బడాలు.. మామ్మకు ముంజలు.. అత్తకు అరటికాయలు.. మామలు, బామ్మర్ధులు, మరదళ్లకు ఉసిరికాయలు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందంటూ సెటైర్లు వేశారు.

మొత్తానికి, కేవలం నగదు బదిలీలే కాకుండా, పలహారాల బదిలీ కూడా కూటమి లక్ష్యం అని స్పష్టంగా అర్థమవుతోంది. సోషల్ మీడియాలో విమర్శలు, వ్యంగ్యాలు వెల్లువెత్తుతున్నప్పటికీ, కూటమి మాత్రం తన ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టుంది.

కాబట్టి, ఇంకెవరైనా నవ్వాలనుకుంటే ఒకసారి పాల్ గారి వీడియో చూసి, ఆయన చెప్పినట్టు “హే నవ్వకండే!” అంటారు. ఎందుకంటే, త్వరలోనే మన తల్లులు, తండ్రులు, తాతలు, మామ్మలు, అత్తలు, మామలు, బామ్మర్ధులు, మరదళ్లు… అందరూ కడుపునిండా తిని, పలహారాల మత్తులో మునిగి తేలుతున్నప్పుడు, నవ్వడానికి ఓపిక ఎక్కడుంటుందండి! కాబట్టి, ఓపిక పట్టండి, పలహారాల వాన త్వరలో కురవబోతోంది!

వీడియో కోసం క్లిక్ చేయండి
వీడియో

 

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories