తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో మాటల యుద్ధం ఎప్పుడూ తారస్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు వైసీపీ నేత కురసాల కన్నబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.
తాజాగా మహిళా టీమిండియా ప్రపంచకప్ గెలవడం నేపథ్యంలో టీడీపీ వర్గాలు లోకేష్ గ్యాలరీలో కూర్చోవడమే జట్టుకు స్ఫూర్తి అని చెప్పడం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కన్నబాబు ఘాటు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇలా వ్యాఖ్యానించారు. “లోకేష్ గ్యాలరీలో కూర్చోవడం వల్ల స్ఫూర్తితో మహిళా భారత్ క్రికెట్ కప్పు కొట్టారంట! ఎవడికో పుట్టిన బిడ్డకు మా బిడ్డ అని చెప్పి పేరు పెట్టుకోవడం తండ్రి, కొడుకులు అలవాటు.”
కన్నబాబు ఈ వ్యాఖ్యలతో టీడీపీ నాయకుల “క్రెడిట్ తీసుకునే” అలవాటుపై సెటైర్ వేశారు. మహిళా జట్టు విజయం దేశానికి గౌరవం తెచ్చిన సందర్భంలో రాజకీయ లాభాల కోసం దాన్ని తమకే క్రెడిట్గా చూపించుకోవడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కొందరు యూజర్లు కన్నబాబు వ్యాఖ్యలను “రియాలిటీ చెక్”గా చూస్తుండగా, టీడీపీ అనుచరులు మాత్రం “లోకేష్పై అసూయతో మాట్లాడుతున్నాడు” అంటూ ప్రతిస్పందిస్తున్నారు.
ఏది ఏమైనా, మహిళా జట్టు గెలుపు ఆనందాన్ని రాజకీయ రంగంలోకి లాగుతూ రెండు పార్టీల మధ్య మాటల పోరు మరింత రసవత్తరంగా మారింది.

