Top Stories

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారితోపాటు ఐక్యరాజ్యసమితి కార్యక్రమానికి వెళ్లడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఏబీఎన్ చానెల్‌లో సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ నేరుగా ప్రశ్నలు సంధించారు.

“జైలు నుంచి వచ్చిన వ్యక్తిని యూఎన్‌కు పంపించడానికి బీజేపీ ఎందుకు ముందుకొచ్చింది?” అని వెంకటకృష్ణ లైవ్ డిబేట్‌లో నిలదీశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరో సెన్సేషనల్ విషయం బయటకు వచ్చింది. బీజేపీకి చెందిన ఒక అతి పెద్ద నాయకుడు ఈ వ్యవహారంలో నేరుగా ఇన్‌వాల్వ్ అయ్యాడని, టీడీపీ నేతలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా హెచ్చరించాడని ఏబీఎన్ చానెల్ లో వెంకటకృష్ణ వెల్లడించాడు

టీడీపీ ఎంపీలు ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, బీజేపీ హైకమాండ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ విషయంపై స్పందించారు. “మేము బీజేపీకి ఇప్పటికే తెలియజేశాం, తప్పు సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు” అని పట్టాభి వ్యాఖ్యానించారు.

ఇక మరోవైపు, వెంకటకృష్ణ మైండ్‌వాయిస్ మాత్రం స్పష్టంగా వినిపించింది “ఏంటి బ్రో ఇలా చేస్తున్నారు?” అని. ఈ ఒక్క వ్యాఖ్యే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బీజేపీ–వైసీపీ మధ్య పెరుగుతున్న ఈ రాజకీయ సాన్నిహిత్యం టీడీపీ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తుందా? లేదా ఇది కేవలం డిప్లొమాటిక్ కార్యక్రమం కోసమా అన్నదానిపై చర్చలు వేడెక్కుతున్నాయి.

మొత్తం మీద, మిథున్ రెడ్డి–పురంధేశ్వరి యుఎన్ పర్యటన బీజేపీ, టీడీపీ, వైసీపీ మధ్య కొత్త రాజకీయ చర్చలకు తెరలేపింది.

https://x.com/Samotimes2026/status/1977766773530517646

Trending today

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

Topics

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

జగన్ మీద తోసెయ్యిచ్చు కదా వెంకటకృష్ణ

ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం...

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

Related Articles

Popular Categories