వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారితోపాటు ఐక్యరాజ్యసమితి కార్యక్రమానికి వెళ్లడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఏబీఎన్ చానెల్లో సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ నేరుగా ప్రశ్నలు సంధించారు.
“జైలు నుంచి వచ్చిన వ్యక్తిని యూఎన్కు పంపించడానికి బీజేపీ ఎందుకు ముందుకొచ్చింది?” అని వెంకటకృష్ణ లైవ్ డిబేట్లో నిలదీశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మరో సెన్సేషనల్ విషయం బయటకు వచ్చింది. బీజేపీకి చెందిన ఒక అతి పెద్ద నాయకుడు ఈ వ్యవహారంలో నేరుగా ఇన్వాల్వ్ అయ్యాడని, టీడీపీ నేతలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా హెచ్చరించాడని ఏబీఎన్ చానెల్ లో వెంకటకృష్ణ వెల్లడించాడు
టీడీపీ ఎంపీలు ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, బీజేపీ హైకమాండ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ విషయంపై స్పందించారు. “మేము బీజేపీకి ఇప్పటికే తెలియజేశాం, తప్పు సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు” అని పట్టాభి వ్యాఖ్యానించారు.
ఇక మరోవైపు, వెంకటకృష్ణ మైండ్వాయిస్ మాత్రం స్పష్టంగా వినిపించింది “ఏంటి బ్రో ఇలా చేస్తున్నారు?” అని. ఈ ఒక్క వ్యాఖ్యే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బీజేపీ–వైసీపీ మధ్య పెరుగుతున్న ఈ రాజకీయ సాన్నిహిత్యం టీడీపీ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తుందా? లేదా ఇది కేవలం డిప్లొమాటిక్ కార్యక్రమం కోసమా అన్నదానిపై చర్చలు వేడెక్కుతున్నాయి.
మొత్తం మీద, మిథున్ రెడ్డి–పురంధేశ్వరి యుఎన్ పర్యటన బీజేపీ, టీడీపీ, వైసీపీ మధ్య కొత్త రాజకీయ చర్చలకు తెరలేపింది.