అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్, ఆయన కుటుంబంపై అనుచిత పదజాలం వాడిన ఆడియో లీక్ కావడంతో అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో ఆయన ఫ్లెక్సీలు చించివేసి, కార్యాలయాలను ముట్టడించారు.
ప్రసాద్ తన వాయిస్ కాదని, రాజకీయంగా తనను ఇరుకున పెట్టేందుకు సృష్టించిన ఆడియో అని స్పష్టంచేసి, అభిమానులను క్షమించమని కోరినా ఎన్టీఆర్ అభిమానులు తగ్గడం లేదు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ నుంచి కూడా అభిమానులు అనంతపురానికి తరలివస్తుండగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం చంద్రబాబు ప్రసాద్ను మందలించినా అభిమానుల ఆగ్రహం ఇంకా కొనసాగుతూనే ఉంది. రానున్న రోజుల్లో ఈ వివాదం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.