Top Stories

కూటమికి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకబడ్డ అభ్యర్థి!

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మరియు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కృష్ణ-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపులో కూటమికి ఊహించని షాక్ తగిలింది. కూటమి నేరుగా అభ్యర్థిని నిలపకపోయినప్పటికీ, ఏపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అయితే, మొదటి రౌండ్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ తన ప్రధాన ప్రత్యర్థి పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడుకంటే వెనుకబడ్డారు.

ఈ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ పోటీ చేయగా, పిఆర్టియు నుంచి మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, యుటిఎఫ్ తరఫున విజయ గౌరీ బరిలో నిలిచారు. త్రిముఖ పోటీలో హోరాహోరీ పోటీ నెలకొంది. కూటమి మద్దతుతో రఘువర్మ విజయం సాధిస్తారని భావించినా, మొదటి రౌండ్ ఫలితాలు భిన్నంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తొలి రౌండ్లో మొత్తం 20,783 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 19,813 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఈ లెక్కింపులో గాదె శ్రీనివాసుల నాయుడుకు 7,210 ఓట్లు రాగా, రఘువర్మ 6,835 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో పిడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరీ 5,810 ఓట్లను సంపాదించారు.

ఇప్పటివరకు ఎవరికీ గెలిచేంత ఆధిక్యం లభించలేదు. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. త్రిముఖ పోటీ నేపథ్యంలో గెలుపెవరిదో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.

Trending today

కూటమికి షాక్! వైసీపీలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల...

జగన్ పాదయాత్ర 2.0.. ఎలా ఉంటుందంటే?

2024 ఎన్నికల పరాజయం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్...

వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ మంత్రి  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్...

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక...

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ...

Topics

కూటమికి షాక్! వైసీపీలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల...

జగన్ పాదయాత్ర 2.0.. ఎలా ఉంటుందంటే?

2024 ఎన్నికల పరాజయం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్...

వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ మంత్రి  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్...

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక...

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ...

రాయపాటికి అరుణపై వెంకటరెడ్డి వైల్డ్ ఫైర్.. వైరల్ వీడియో

టీవీ చర్చా వేదికలు ప్రస్తుతం రాజకీయ విమర్శలకు, మాటల యుద్ధాలకు కేంద్రంగా...

ఏబీఎన్ వెంకటకృష్ణ.. మళ్లీ ఏసాడు

సీనియర్ జర్నలిస్ట్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్...

బాబు వీడియో చూసి నవ్వితే బాగోదు…. ముందే చెప్తున్నా…

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంపై ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ షో ఏదైనా ఉందంటే...

Related Articles

Popular Categories