Top Stories

టీడీపీ పార్టీలో కమీషన్ల కలకలం

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలకే, గుత్తేదారులకే కమిషన్ వేధింపులు తప్పడం లేదన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా పరిధిలో చోటుచేసుకున్న తాజా ఘటన టీడీపీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

అనంతపురం జిల్లాలో రూ.7 కోట్ల విలువైన పైప్‌లైన్ టెండర్ పనులను టీడీపీ ఎంపీకి సంబంధించిన గుత్తేదారు దక్కించుకున్నాడు. అయితే ఈ పనుల్లో నుంచి 10 శాతం కమిషన్ ఇవ్వాలంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నేరుగా గుత్తేదారికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. మొదట గుత్తేదారు తాను టీడీపీ ఎంపీ మనిషినని చెప్పినా, దానిని లెక్కచేయని ఎమ్మెల్యే తమ్ముడు నేరుగా ఎంపీకే ఫోన్ చేసి కమిషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంతో తీవ్రంగా అసహనానికి గురైన ఎంపీ, ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఇదే అంశంపై ఎమ్మెల్యే మరింత దబాయింపులకు దిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “అధిష్టానానికే ఫిర్యాదు చేస్తావా? ఇక్కడ మేమే అధిష్టానం. నాదే రాజ్యం. నన్నెవడు ఏం చేయలేడు” అంటూ ఎమ్మెల్యే బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంతటితో ఆగకుండా, 10 శాతం కమిషన్ ఇవ్వకపోతే పనులకు సంబంధించిన సామాగ్రిని ఎత్తుకుపోతామని కూడా హెచ్చరించినట్లు గుత్తేదారు వర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీ ఎంపీకే స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఈ స్థాయి వేధింపులు ఎదురవుతున్నాయంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని విమర్శకులు అంటున్నారు.

అవినీతి రహిత పాలన, పారదర్శకత అని ఎన్నికల సమయంలో నినాదాలు చేసిన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కమిషన్ల రాజకీయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని చెబుతుంటే, మరోవైపు అధికార పార్టీలోనే నేతల మధ్య కమిషన్ల కోసం పోటీ జరుగుతోందన్న ఆరోపణలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి.

ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, నిజంగా చర్యలు తీసుకుంటుందా? లేక అంతర్గతంగా సర్దిచెప్పి మౌనం పాటిస్తుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Trending today

ఏపీలో ‘రెడ్డి’.. తెలంగాణలో ‘రావు’.. కులాల మద్దతేదీ?!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో...

సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

Topics

ఏపీలో ‘రెడ్డి’.. తెలంగాణలో ‘రావు’.. కులాల మద్దతేదీ?!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో...

సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

Related Articles

Popular Categories