Top Stories

ఏపీలో బీజేపీకి ఏంటీ వింత పరిస్థితి

జాతీయ స్థాయిలో బీజేపీ అపారమైన బలాన్ని, అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. ఏపీలో పొత్తు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఈ కూటమి సాయంతోనే ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారాన్ని దక్కించుకోగలిగారు. సరిగ్గా ఇదే కారణం చేత, ఏపీకి కేంద్రం చేసిన మేలును, అలాగే విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వంటివారు చేసిన పోరాటాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రచారం చేసుకోలేక పోతున్నారు.

కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ కూటమి ద్వారా దక్కాల్సిన రాజకీయ ప్రయోజనాలు ఆ పార్టీకి దక్కడం లేదు. టీడీపీ ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తుండటం, రాష్ట్ర బీజేపీలో టీడీపీ నేపథ్యం ఉన్న నేతలే అధికంగా ఉండటం.. కేంద్ర పెద్దలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో… ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మాటే చెల్లుబాటు అవుతోంది.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఈ మధ్యకాలంలో భారీగా సహాయం చేస్తోంది. అమరావతి రాజధానికి రూ. 15,000 కోట్లు అందించడం… పోలవరం ప్రాజెక్టుకు ఎనలేని సహకారం ఇచ్చింది. రోడ్డు-రైల్వే ప్రాజెక్టుల అదనంగా కేటాయింపులు చేసింది. విశాఖపట్నంలో ప్రభుత్వ రంగ సంస్థల రూపంలో భారీ పెట్టుబడులు పెట్టంది. ఇంత చేసినా, ఈ సాయం బీజేపీ వల్లే దక్కిందని ఏపీ ప్రజలకు వివరించడంలో, ప్రచారం చేయడంలో రాష్ట్ర బీజేపీ నాయకులు విఫలమవుతున్నారు.

వాస్తవానికి, ఏపీలో టీడీపీ కంటే బీజేపీయే సీనియర్ పార్టీ. టీడీపీ ఆవిర్భావం సమయంలోనే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం పోరాడిన చరిత్ర కూడా ఉంది. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నా, రాష్ట్రంలో సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం ఏపీ బీజేపీ చేయడం లేదు.

ఏ రాజకీయ పార్టీ అయినా తమ బలాన్ని నమ్ముకొని ఎదగాలి. కానీ ఏపీలో బీజేపీ ఎదుగుదల కనిపించడం లేదు. మరో పార్టీ బలాబలాలపై ఆధారపడటం మానుకొని, తమ సొంత బలాన్ని అభివృద్ధి చేసుకుంటేనే ఆ పార్టీకి మనుగడ. లేదంటే, రాబోయే కాలంలో కూడా ఆ పార్టీకి పొత్తులే శరణ్యం అవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories