ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.భోగాపురం ఎయిర్పోర్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో ప్రారంభమైన పనులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సరిగా కొనసాగించలేకపోయిందనే విమర్శలు ప్రజల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
ఈ ఆరోపణలు పెరుగుతుండటంతో ఎల్లో మీడియా వర్గాల్లో స్పష్టమైన ఆందోళన కనిపిస్తోంది. సాధారణంగా టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తుందని ఆరోపణలు ఎదుర్కొనే కొన్ని ఛానళ్లలోనే ఇప్పుడు “టీడీపీకి మైనస్ పెరుగుతోంది” అనే స్వరం వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇటీవల ఒక చర్చా కార్యక్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటకృష్ణ,“ప్రజల్లో టీడీపీపై నెగెటివిటీ పెరుగుతోంది” అంటూ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
అలాగే టీవీ5 న్యూస్ యాంకర్ మూర్తి కూడా భోగాపురం ఎయిర్పోర్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో టీడీపీ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని, దీనివల్ల ప్రజల్లో పార్టీ చులకన అయిందని వ్యాఖ్యానించడం ఎల్లో మీడియా ధోరణిలో వచ్చిన అరుదైన మలుపుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
విశాఖపట్నానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్టు
మరియు కరవు రాయలసీమకు ప్రాణాధారమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలో ఊపందుకున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వాటిని వేగంగా పూర్తి చేయడంలో విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని సోషల్ మీడియా ట్రెండ్స్ చెబుతున్నాయి.
ఇన్నాళ్లూ టీడీపీకి అనుకూలంగా కథనాలు, డిబేట్లు నిర్వహించిన ఎల్లో మీడియా ఇప్పుడు అదే పార్టీపై నెగెటివిటీ పెరుగుతోందని ఒప్పుకోవడం వెనుక భయం, అసహనం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రజాభిప్రాయం పూర్తిగా మారుతున్న వేళ, దాన్ని దాచిపెట్టలేక ఎల్లో మీడియా యాంకర్లే బహిరంగంగా వాపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.
మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక అంశాల్లో టీడీపీ ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఆ ప్రభావం ఇప్పుడు ఎల్లో మీడియా స్టూడియోలకూ చేరిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ నెగెటివిటీ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.


