Top Stories

లోకేష్ స్ఫూర్తితోనే టీమిండియా గెలిచిందట

ప్రపంచ వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న భారత మహిళా జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కష్టసాధ్యమైన పోరాటం తరువాత ట్రోఫీని గెలుచుకున్న ఈ గర్ల్స్‌ నిజంగా గర్వించదగ్గ ఘనత సాధించారు. దేశం అంతా ఈ విజయంలో తడిసి ముద్దవుతుంటే, ఆ ఆనందంలో కూడా ఎవరో ఒకరు రాజకీయ రంగు వేసే ప్రయత్నం చేస్తారేమోనని ఎవరూ ఊహించలేదేమో!

అయితే… ఊహించని చోటునుంచే ట్విస్ట్ ఇచ్చారు ప్రముఖ టీవీ5 యాంకర్ సాంబశివరావు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్‌ పండుగకు కారణమయ్యాయి.

“కప్ గెలవడంలో సచిన్, లోకేష్ పాత్ర ఉంది!” అవును! అదే నిజం. మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు కాదు, సచిన్ టెండూల్కర్ మరియు లోకేష్ నారా భారత జట్టుకు స్ఫూర్తినిచ్చారని సాంబన్న గారు సీరియస్‌గా చెప్పారు. అంతేకాదు, “మ్యాచ్ ఆడకముందే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఓడిపోయామనేసింది. కారణం సచిన్, లోకేష్ ఇచ్చిన స్పూర్తే!” అని కూడా జోడించారు.

ఇంతకుముందు గూగుల్ ప్రాజెక్ట్, టాటా ఇన్వెస్ట్‌మెంట్, లేదా సౌరశక్తి కేంద్రం ఏదైనా జరగాలి అంటే “లోకేష్ వల్లే” అని చెప్పే సాంబశివరావు ఇప్పుడు వరల్డ్‌కప్‌కూ అదే ఫార్ములా ఫాలో చేశారు.

ఇంటర్నెట్‌ లో ప్రజలు మాత్రం దీన్ని విడిచిపెట్టలేదు. “టీమిండియా మహిళలు ఆడిన మ్యాచ్‌లా? లేక లోకేష్ ప్రాక్టీస్ చేశాడా?” “ప్రతీ విజయానికి టీడీపీ బ్రాండ్ ట్యాగ్ పెట్టేస్తే… దేశం అంతా ఎల్లో అవుతుంది!” అన్న రీతిలో మీమ్స్‌, సెటైర్లు వర్షం కురుస్తోంది.

విజయం భారత మహిళలది. వారు రాసిన చరిత్ర వారికి చెందాలి.
కానీ రాజకీయ మైండ్‌సెట్‌తో ప్రతీ విషయాన్నీ “లోకేష్, బాబు” చుట్టూ తిప్పే ఎల్లో మీడియా పద్ధతి ఇప్పుడంతా ప్రజల హాస్యానికి కారణమవుతోంది.

సాంబన్న గారు, ఒక సజెషన్ మరోసారి ఎవరైనా విజయం సాధిస్తే, క్రెడిట్ ఇవ్వడానికి ముందు వాళ్లే గెలిచారని గుర్తుంచుకోండి. ఇలా కొనసాగితే “లోకేష్ వల్లే సూర్యుడు ఉదయమవుతున్నాడు” అనే హెడ్‌లైన్‌ కూడా దూరంలో లేదు!

https://x.com/Samotimes2026/status/1986451483047682178

Trending today

చిరంజీవిని ఘోరంగా అవమానించిన టీవీ5 మూర్తి

రాజకీయ ప్రచారంలో భాగంగా ఎల్లో మీడియా మళ్లీ తన స్థాయి చూపించింది....

వైసీపీ గూటికి విజయసాయిరెడ్డి?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి మళ్లీ జగన్...

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు...

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు...

Topics

చిరంజీవిని ఘోరంగా అవమానించిన టీవీ5 మూర్తి

రాజకీయ ప్రచారంలో భాగంగా ఎల్లో మీడియా మళ్లీ తన స్థాయి చూపించింది....

వైసీపీ గూటికి విజయసాయిరెడ్డి?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి మళ్లీ జగన్...

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు...

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు...

కేశినేని చిన్ని ఖేల్ ఖతం

తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట...

వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాళ్లే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన...

లోకేష్-తిలక్ వర్మ ఒక్కటేనట

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి....

Related Articles

Popular Categories