ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ కొత్త విషయం కాదు. కానీ ఈసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం హద్దులు దాటింది. వాస్తవాలను పక్కనపెట్టి, రొటీన్గా క్రెడిట్ దోచుకునే ప్రయత్నంలో ఎల్లో బ్యాచ్ అడ్డంగా దొరికిపోయింది.
భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన జరిగింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే. ఈ విషయాన్ని ఎవరో రాజకీయ నాయకుడు కాదు—స్వయంగా ఆ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్న జీఎంఆర్ గ్రూప్ ఎండీ స్పష్టంగా వెల్లడించారు. అయినా సరే, “భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా టీడీపీదే, చంద్రబాబుదే” అంటూ ఎల్లో మీడియా కథనాలు రాయడం.. స్టూడియోల్లో గొప్పలు చెప్పడం మొదలైంది.
ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే వాస్తవాలు చెప్పడం జర్నలిజమా? లేక వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ భజన చేయడమా? భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఏ ఒక్క పార్టీ వ్యక్తిగత ఆస్తి కాదు. ఇది రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ప్రాజెక్ట్. కానీ దానిని కూడా రాజకీయ లాభాల కోసం వక్రీకరించడం ఎల్లో మీడియా ప్రత్యేకతగా మారింది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా క్రెడిట్ మళ్లించే ప్రయత్నాలు చేయడం చూస్తే, ఇది జర్నలిజం కాదు.. ప్రచార యంత్రాంగం అనే మాటే సరిపోతుంది.
ఇంకా దారుణం ఏమిటంటే వెంకటకృష్ణ లాంటి యాంకర్లు కూడా స్టూడియోల్లో కూర్చొని నిజాలను పక్కనపెట్టి రాజకీయ కథనాలను బిల్డప్ చేయడం. “భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చంద్రబాబుదే” అంటూ చెప్పడం అంటే, ప్రజలను మోసం చేయడమే.
వాస్తవాలు ప్రజలకు ఇప్పటికే తెలుసు. శంకుస్థాపన ఎవరు చేశారు?
ప్రాజెక్ట్కు వేగం ఎవరు ఇచ్చారు? నిర్మాణ సంస్థ ఏం చెప్పింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, ఎల్లో మీడియా మాత్రం పాత అలవాట్లు మానడం లేదు. అందుకే ఈసారి క్రెడిట్ హైజాక్ చేయబోయి, బఫూన్లలా అడ్డంగా దొరికిపోయారు.
చివరికి చెప్పాల్సింది ఒక్కటే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ రాజకీయ పార్టీలది కాదు. అది ప్రజలది. నిజాన్ని దాచిపెట్టినా, కాలం ముందు వాస్తవాలు తప్పించుకోవు.

