చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహా న్యూస్ యాంకర్ వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. చంద్రబాబు కట్టించిన భవనాల్లోనే ఆయనను నిర్బంధించడం అన్యాయం అని వంశీ లైవ్ షోలో భావోద్వేగానికి లోనయ్యారు.
“రెండు పార్టీలకు నిద్ర లేకుండా చేసే నాయకుడు చంద్రబాబు. ప్రభుత్వాలను మార్చగల శక్తి ఉన్న వ్యక్తి. కానీ ఆయనను అన్ని రోజుల్లో జైలులో పెడతారా?” అంటూ వంశీ వాపోయారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు ఆయనకు ‘జైలు గోడల’ుగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, చంద్రబాబుపై ఉన్న కేసులు, స్కాంల గురించి ఒక్క మాట ప్రస్తావించకపోవడం సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది. “చేసిన మోసాల కోసం శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఇంత బిగ్గరగా ఏడవడం ఎందుకు?” అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.
యాంకర్ వంశీ చేసిన భావోద్వేగపు వ్యాఖ్యలపై నెటిజన్లు సరదా మీమ్స్, ట్రోల్స్తో సోషల్ మీడియాను హోరెత్తించారు. “చంద్రబాబుకి కన్నా వంశీకి ఎక్కువ బాధ” అంటూ ట్రోల్ చేయగా, మరికొందరు “బాబు కోసం బట్టలు చింపుకునే స్థితి” అని వ్యంగ్యంగా రాశారు.
ఈ వ్యాఖ్యలు వంశీ వ్యక్తిగత భావోద్వేగమా, లేక రాజకీయ ప్రేరేపితమా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. చంద్రబాబు మద్దతుదారులు వంశీకి బాసటగా నిలిచినా, విమర్శకులు మాత్రం ఆయన ‘ఒకపక్ష ప్రచారం’ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మొత్తం మీద చంద్రబాబు అరెస్ట్ వార్షికోత్సవం సందర్భంగా వంశీ చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు న్యూస్ కంటే ట్రోల్స్కి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి.